ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కొన్ని మాటలు - ఎందుకు పనికి రానివి


 1. జీవితంలో ఎప్పుడైనా

ఎవరి నైనా పనికి రాని వారిగా

పరిగణించవద్దు ఎందుకంటే

చెడిపోయిన గడియారం

కూడ రోజుకు రెండు సార్లు

సరైన సమయం

సూచిస్తుంది


2. ఎప్పుడూ ఇతరుల తప్పులను

అన్వేషించే వ్యక్తి అందమైన

పుష్పాల పరిమళాలను

వదలి పుండు మీద వాలే

ఈగ లాంటి వాడు


3. పేదరికం ధరిచేరినప్పుడు

ఆప్తమిత్రులు కూడ

దూరమైతారు అదే

ధనవంతులైనప్పుడు

తెలియని వారు కూడ

మిత్రులవుతారు


4. ఒక్క సారి నవ్వుతూ చూడు

ప్రపంచంలో ఉండే అందాలన్ని

నీ సొంతమవ్వుతాయి కానీ

తడిసిన కనురెప్పలతో

చూసే అద్దంకూడ మసక

బారి పోతుంది


5. తొందరగా దొరికేది ఏదైనా

ఎక్కువకాలం మన్నికరాదు

ఎక్కువకాలం మన్నిక

వచ్చేది అంతతొందరగా

దొరకదు


6. జీవితంలో వచ్చే చెడు రోజులు

కూడా మన మంచి కొరకే

అనుకోవాలి అప్పుడే

తెలుస్తుంది నిజమైన

స్నేహితులు ఎవరైనది


7. మనిషికి రోగాలు కుందేలు లాగా

వస్తాయి తాబేలు లాగా

వెళ్లుతాయి కానీ డబ్బులు

తాబేలు లాగ వస్తాయి

కుందేలు లాగా

వెళ్లుతాయి


8. చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని

వెతకటం అలవాటు

చేసుకోవాలి ఎందుకంటే

పెద్ద పెద్ద మాటలు

జీవితంలో చాలా

అరుదుగా చోటు

చేసుకుంటాయి


9. ఈశ్వరుని ప్రార్ధించినప్పుడు

నాకు ఏమి ఇవ్వలేదని

బాధపడకు ఎందుకంటే

నీకు అక్కడ ఇవ్వక

పోయినా నీకు నచ్చిన

చోట నీకు ఈశ్వరుడు

నచ్చినవిధంగా ఇస్తాడు


10. నిత్యము ఎదురయ్యే

అపజయాలను చూసి

నిరాశ చెందకు కానీ

ఒక్కోసారి తాళంచెవి

గుచ్చంలో ఉండే ఆఖరి

తాళంచెవి కూడ తాళం

తెరుస్తుందని

గమనించు


11. ఈ సమాజంలో నేను ఒక్కడిని

ఎంచేయగలననీ ప్రతి మనిషి

నిరాశ చెందుతుంటాడు

కానీ ఒక్క సారి తలపైకెత్తి

చూడు ప్రపంచానికి

వెలుగునిచ్చే సూర్యుడు

కూడ ఒక్కడేనని


12. బంధవులు ఎంత చెడ్డ వారైనా

సరే వదులుకోవద్దు

ఎందుకంటే మురికి నీరు

దప్పిక తీర్చలేక పోయిన

కనీసం అగ్గి మంటలు

ఆర్పటానికి పనికి

వస్తాయి


13. నమ్మక ద్రోహి స్నేహితునికన్నా

దురాశపరుడు సన్నిహితుడు

మిన్న మట్టితో చేసిన

మనుషులు కాగితాలకు

అమ్ముడు పోతారు


14. మనిషి గా మాట్లాడుట

రాక పోయినా కనీసం

పశువుల మౌనంగా

ఉండటమే ఉత్తమం


15. మనకు మాటలు రాక ముందు

మనముఎంచెప్పబోతున్నామో

అమ్మకు అర్థమయ్యేది కాని

మనము మాటలు అన్ని

నేర్చిన తరువాత ఇప్పుడు

మాటమాటకు ప్రతిసారి

అమ్మా నీకు అర్థం

కాదులే అంటాం


16. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు

దూరమైనారని బాధపడకు

ఎందుకంటే నీవు ఒక్కనివే

జయించగలవని వారు

నమ్మినందుకు నీవు

సంతోషించు


17. సిగ్గు మర్యాద లేని

ధనవంతుడు ఎల్లయ్య కన్నా

మంచి మానవత్వం ఉన్న

పేదరికం సుబ్బయ్య మిన్న


18. జీవితంలో హెచ్చుతగ్గులు

రావటంకూడ మనమంచి

కోసమే అనుకోవాలి

ఎందుకంటే ECG లొ

వచ్చే సరళరేఖా కూడ

మృత్యువును

సూచిస్తుంది


19. ఈ రోజుల్లో సంబంధాలు

రొట్టె తొ సమానమైనవి

ఎందుకంటే కొద్దిగా మంట

ఎక్కవైందొలెదో రొట్టె

మాడిమసి కావటం

ఖాయం


20. జీవితంలో మంచి వారి కోసం

అన్వేషించ వద్దు ముందు

నీవు మంచిగా మారు

బహుశా నిన్ను కలిసిన

వ్యక్తికి మంచి మనిషి

అన్వేషణ పూర్తి

కావచ్చు నేమో

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి