ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఒక వీరుని చరిత్రకు సంబంధించిన ఒకపేజీ అర్ధాంతరంగా కనుమరుగైనరోజు


సుభాష్ చంద్రబోస్ ...ఈ పేరు తెలియని భారతీయుడుండడేమో...ఆ పేరు వినబడగానే ఏదో మనసులో ఒక ఆరాధభావన.. ఆయన మతాలకతీతుడు, కులవర్గాలకు అతీతుడు..ఈ దేశంలో జన్మించి విదేశీయుల బానిసత్వం నుండి ఈ దేశానికి విముక్తి కలిగించాలని పోరాటం చేస్తూ కనుమరుగైపోయిన ఒక గొప్ప స్వాతంత్రసమరయోధుడు ఈ నేతాజీ!!!

     జనవరి 23,1897లో కటక్ లో ఒక సంపన్నకుటుంబంలో జన్మించిన బోస్ అక్కడే విద్యాభ్యాసం చేశారు.తండ్రి జానకీనాథ్ గొప్పలాయర్ ..మరియ అతివాద భావాలు గల కాంగ్రీస్ నాయకుడు. 1920 లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షలో నాల్గవర్యాంక్ రాగా ఇంగ్లీషులో ఆల్ ఇంగ్లండ్ స్తాయిలో ప్రథముడుగా నిలిచాడు. అయితే 1921 ఏప్రెల్ లో సివిల్ సర్వీస్ కి రిజైన్ చేసి భారతస్వాతంత్రోద్యమంలోనికి ప్రవేశించారు..భారత జాతీయకాంగ్రీసు లో యువజన అధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషించారు.చిత్తరంజన్ దాస్ గారితో కలిసి బెంగాల్ ఉద్యమం నడిపేరు. హిందీలో అతని ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగించేవి.అనతికాలంలో మంచివక్తగా, ఆకర్షణీయమైన నాయకుడిగా ఎదిగేరు. 1937 డిశంబరు 26 న ఎమిలీషెంకల్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు..

  అయితే స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్న తీరుపట్ల బోస్ అసంతృప్తిగా వుండేవారు.గాంధీగారితో సిద్దాంతపరమైన విభేదాలు కూడా వుండేవి..అహింసతో పాటు సాయుధపోరాటం కూడా వుండాలని అభిప్రాయపడేవాళ్ళు,. అదీగాగ కొందరు కుల,మత వర్గభేదాలతో ఆంగ్లేయులకు దగ్గరై వారికి విధేయులుగా మారి ఉద్యమం ను నీరుకార్చుతుండటం కూడా బోస్ కు నచ్చేది కాదు. 1938 లో గాంధీకి వ్యతిరేఖంగా జాతీయకాంగ్రీసు అధ్యక్ష ఎన్నికలలో నిలుచొని మన పట్టాభి గారిపై అఖండ విజయం సాధించాడు. పట్టాభి తరపున ప్రచారం చేసిన గాంధీజీ పట్టాభి ఓటమి తన ఓటమిగా అంగీకరించిగా, బోస్ తన పదవికి రాజనామా చేసి పార్వార్డ్ బ్లాక్ ను స్థాపించాడు.జాతీయప్రణాళికాకమిటీని ఏర్పరిచారు.

    అయితే 1939లో రెండవ ప్రపంచయుద్దం ప్రారంభమవగా,నాటి ఇండియన్ గౌవర్నర్ జనరల్ లిన్ లిత్ గో ఇక్కడ కాంగ్రీస్ నాయకులెవరినీ సంప్రదించకుండానే భారతీయులు ఇంగ్లండ్ తరుపున పోరాడుతున్నట్లు ప్రకటించాడు. గాందీ,నెహ్రూ, అంబేద్కర్ లాంటి నాయకులు ఆయనను సమర్థించగా,బోస్ తీవ్రంగా వ్యతిరేఖించాడు.దానికి ప్రతిచర్యగా బోస్ ను జైల్ లో పెట్టేరు. అక్కడ 7రోజులు నిరాహారదీక్షచేయగా ఆయన జైలు నుండి విడుదల చేసి గృహనిర్భంధంలో పెట్టింది.


   రెండవప్రపంచయుద్దంలో ఇంగ్లండ్ కు వ్యతిరేఖంగా పోరాడుతున్న జర్మనీ,జపాన్ లాగా మనమూ ఇంగ్లండ్ పై సాయుధ పోరాటం చేయాలని, సొంత సైనికశక్తిని,విదేశీ వ్యవహారాల శాఖ ను ఏర్పాటు చేసుకోవాలని వాదించేవాడు..ఇది ఇతర నాయకులకు నచ్చలేదు.

1941 జనవరి 19 తన మేనళ్ళుడు శశిరకుమాతో కలిసి ఒక పఠాన్ వేషంలో గృహనిర్భందం నుండి తప్పించుకొని పెషావర్ పారిపోయాడు.అక్కడ అక్భర్ షా,మహ్మద్ షా,భగత్ రాం తల్వార్ లతో పరిచయం అయింది.1941 జనవరి 26 న గడ్దం పెంచుకొని ,మూగచెవిడి వాడిగా నటిస్తూ మియా అక్భర్ ,ఆగాఖాన్ సహాయంతో కాబూల్ చేరాడు. అక్కడ నుండి ఇంగ్లండ్ కు శతృవైన రష్యా సహాయం కోరాలనే ఆలోచనలతో రష్యాలో అడుగుబెట్టేరు. అయితే రష్యా సహాయనిరాకరణ చేసింది.రష్యా సైన్యం అతనిని జర్మన్ రాయబారి షూలెన్ బర్గ్ కు అప్పగించింది.ఆయన అతనిని బెర్లిన్ పంపాడు. ఇది తెలుసుకున్న బ్రిటన్ బోస్ బెర్లిన్ చేరే లోపల ఆయనను హతమార్చమని ఒక రహస్య గూఢాచారిదళాన్ని ఏర్పాటు చేసింది. అయినా వారికి ఏమార్చి బెర్లిన్ చేరాడు.హిట్లర్ తో సమావేశమయిన తర్వాత అక్కడ వున్న భారత యుద్ధఖైదీలు,రబ్బరుతోటల కూలీలు 4500 మందితో ఇండియన్ లెజియన్ ఏర్పాటుచేశారు. ఈ సైనికదళం హిట్లర్ తో సమానంగా బోస్ ను గౌరవించేవాళ్ళు. 1941 నుండి 1943 దాకా అక్కడే వున్న బోస్ బ్రిటన్ గూఢాచారిదళాన్ని కన్నుకప్పుతూ జర్మన్ జలాంతర్గామి u 180 లో ప్రయాణించి దాని నుండి జపాన్ జలాంతర్గామి I 29 లోకి మారి 1943 సెప్టంబర్ లో సింగపూర్ కి చేరాడు.సింగపూర్ లో అజాద్ హింద్ ప్రభుత్వాన్ని నెలకొల్పేడు. దీనికి సొంత కరెన్సీ,తపాలాబిళ్ళలు,న్యాయ మరియు పౌరనియమాలు రూపొందించుకొనే అధికారం దక్కింది. ఈ ప్రభుత్వాన్ని జర్మనీ,ఇటలీ,క్రొయేషియా,థాయ్ లాండ్ ,గుర్తించాయి.ఇటీవల పరిశోధనల మూలంగా రష్యా ,USA లు కూడా అమోదించినట్లు తెలిసింది. అజాద్ హింద్ ఫౌజ్ సేనతో బోస్ ఎన్నో ఉత్తేజిత ప్రసంగాలు చేసేవాడు.""మీ రక్తాన్ని ధారపోయండి-మీకు స్వాతంత్రం ఇస్తాను" అని భావోద్రికంగా అనేవాడు..ఎందరో దేశభక్త యువకులు దానిలో సైనికులుగా చేరుటకు ఉవిళ్ళూరేవారు..నేతాజీ పర్యవేక్షణలో అఖండ విజయాలు సాధిస్తూ బర్మా వరకు వచ్చిన సేన ,బెంగాల్ లోనికి ప్రవేశించేందుకు సమాయత్తమయ్యే సమయంలో జపాన్ అమెరికా పెరల్ హార్బర్ మీద బాంబులు వేసింది. హిట్లర్ రష్యా మీద దాడికి దిగేడు..దీనితో అమెరికా,రష్యాలు యుద్దరంగంలో దిగడం జర్మనీ,జపాన్ ఓడిపోవడం , సుభాష్ చంద్ర బోస్ కు సహాయం ఆగిపోవడం జరిగింది. ఈ క్రమంలో సింగపూర్ నుండి తైవాన్ వెళ్ళేందుకు విమానం ఎక్కగా ఆ విమానం ప్రమాదం గురైందని ఆ ప్రమాదంలో ఆయన మరణించారని కథనం...ఒక వీరుని చరిత్ర మరుగునపడిపోయింది...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి