గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ....
మరణం 27 సెప్టెంబరు1972
గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి.
ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం.
1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడి పాఠశాలలు, సీనియర్_సిటిజన్, పౌర గ్రంథాలయాల పని తీరును పరిశీలించి, భారత దేశంలో గ్రంథాలయాల అభివృద్ధికి 30 సంవత్సరాల ప్రణాళిక రూపొందించారు. యుకె, ఐరోపా, అమెరికా, శ్రీలంక, పొలెండ్, జర్మని, రష్యా, నెదర్లాండ్స్ మెదలగు ఎన్నో దేశాలు పర్యటించి ఆయా దేశాలలోని ఉన్న గ్రంథాలయలను పరిశీలించి, గ్రంథాలయ శాస్త్రంలో ఉన్న నూతన పద్ధతులను ఆకళింపు చేసుకొని, మన దేశంలో గ్రంథాలయ శాస్త్రంలో దిక్సూచిగా నిలిచారు. రంగనాథన్ గారు 60 పుస్తకాలకు పైగా ప్రచురించారు. 2 వేలకు పైగా పరిశోధక వ్యాసాలు ప్రచురించారు, ఐదు గ్రంథాలయ శాస్త్ర పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు.
1931వ సంవత్సరంలో గ్రంథాలయ శాస్త్రానికి సంబంధించి రంగనాథన్ ప్రవేశ వెట్టిన
1. అధ్యయనం కొసం పుస్తకాలు
2. ప్రతి చదువరికి ఒక పుస్తకం
3. ప్రతి పుస్తకానికి ఒక చదువరి
4. చదువరి సమయం ఆదా చేయడం
5. గ్రంథాలయం నిత్యం అభివృద్ధి చెందుతున్న సజీవ వ్యవస్థ అనే ఐదు సూత్రాలు గ్రంథాలయ శాస్త్ర రూపురేఖలను మార్చివేశాయి.
రంగనాథన్ చేసిన నూతన సంస్కరణల వలన బారత దేశ గ్రంథాలయ వ్యవస్థ ప్రపంచ గ్రంథాలయ శాస్త్రంలో నూతన అధ్యయనాన్ని లిఖించింది. వారు చేసిన సేవలు, అవిష్కరణలను గుర్తించి భారత ప్రభుత్వం ‘భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు’గా ఆయనను గుర్తించింది. ఆగస్టు 12, 1892లో జన్మించిన షియాలి రామమృత రంగనాథన్ 1972 సెప్టెంబర్ 27న మరణించారు. వారి పుట్టిన రోజునే ‘జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం’గా దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు.
ఆగష్టు12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి