ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ....


జననం 12 ఆగష్టు 1892

మరణం 27 సెప్టెంబరు1972


గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి.

ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం.

1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడి పాఠశాలలు, సీనియర్_సిటిజన్, పౌర గ్రంథాలయాల పని తీరును పరిశీలించి, భారత దేశంలో గ్రంథాలయాల అభివృద్ధికి 30 సంవత్సరాల ప్రణాళిక రూపొందించారు. యుకె, ఐరోపా, అమెరికా, శ్రీలంక, పొలెండ్, జర్మని, రష్యా, నెదర్లాండ్స్ మెదలగు ఎన్నో దేశాలు పర్యటించి ఆయా దేశాలలోని ఉన్న గ్రంథాలయలను పరిశీలించి, గ్రంథాలయ శాస్త్రంలో ఉన్న నూతన పద్ధతులను ఆకళింపు చేసుకొని, మన దేశంలో గ్రంథాలయ శాస్త్రంలో దిక్సూచిగా నిలిచారు. రంగనాథన్ గారు 60 పుస్తకాలకు పైగా ప్రచురించారు. 2 వేలకు పైగా పరిశోధక వ్యాసాలు ప్రచురించారు, ఐదు గ్రంథాలయ శాస్త్ర పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు.


1931వ సంవత్సరంలో గ్రంథాలయ శాస్త్రానికి సంబంధించి రంగనాథన్ ప్రవేశ వెట్టిన 

1. అధ్యయనం కొసం పుస్తకాలు 

2. ప్రతి చదువరికి ఒక పుస్తకం 

3. ప్రతి పుస్తకానికి ఒక చదువరి 

4. చదువరి సమయం ఆదా చేయడం 

5. గ్రంథాలయం నిత్యం అభివృద్ధి చెందుతున్న సజీవ వ్యవస్థ అనే ఐదు సూత్రాలు గ్రంథాలయ శాస్త్ర రూపురేఖలను మార్చివేశాయి.

 రంగనాథన్ చేసిన నూతన సంస్కరణల వలన బారత దేశ గ్రంథాలయ వ్యవస్థ ప్రపంచ గ్రంథాలయ శాస్త్రంలో నూతన అధ్యయనాన్ని లిఖించింది. వారు చేసిన సేవలు, అవిష్కరణలను గుర్తించి భారత ప్రభుత్వం ‘భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు’గా ఆయనను గుర్తించింది. ఆగస్టు 12, 1892లో జన్మించిన షియాలి రామమృత రంగనాథన్ 1972 సెప్టెంబర్ 27న మరణించారు. వారి పుట్టిన రోజునే ‘జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం’గా దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు.


ఆగష్టు12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి