ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

న్యాయమూర్తిగారు ఇదేం తీర్పు, ఇలా వుందేమిటి!

అపరాధ పరిశోధన అనే డిటెక్టివ్ పక్షపత్రికో మాసపత్రికో ఒకటుండేది. తెలివైనదొంగలు, దొరకని హంతకులు, క్లూలు, తప్పించుకోవడాలు, పట్టుకోవడం, కారాగారంలో రహస్యంగా సోరంగాలు త్రవ్వటం, అంతకంటే తెలివిగా పోలీసులకంటే  ముందుగా డిటెక్టివ్ లు రంగప్రవేశం చేయడం, మారువేషాలలో తిరగటం, క్యాడిలాక్, ఫ్యాంటియాక్ కార్లలో తిరగటం, బిక్షగాడిలా మారడం చివరకు నిందితులను పట్టుకోవడం ఇలా రకరకాల కథలుండేవి.చదువుతుంటే ఎంతో థ్రిల్లింగ్ గా ఆశక్తిగా వుండేది. అందులో నేను చదివిన,నాకు గుర్తున్న, నాకు నచ్చిన జడ్జిగారి అద్భుతమైన తీర్పుకథ ఒక్కటి. కథపేరు కాని, రచయిత పేరు కాని గుర్తులేవు. దాదాపుగా ఈ కథ కూడా 40 సంవత్సరాల క్రిందటిదే....



రంగారావును  హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.పక్కింట్లో సుశీలను పట్టపగలు మధ్యాహ్నం 2 గంటలకు రంగారావే హత్యచేసినట్లు పోలీసులు బలమైన సాక్ష్యాలు తయారుచేసారు.రంగారావు వాడే చేతిరుమాల, కళ్ళజోడు, చెప్పులు మొదలైన కీలక ఆధారాలను నేరస్థలంలో సేకరించారు. వీటితోపాటు సుశీల హత్యకు వాడినకత్తి, సుశీలరక్తం మరకలంటుకొని వున్న రంగారావు బట్టలను పోలీసులు రంగారావు ఇంట్లోనే స్వాధీనపరచుకొన్నారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంగారావే హంతకుడని బల్లగుద్ది మరీ వాదించాడు. పోలీసులు కూడా రంగారావే హంతకుడని వాజ్ఞ్మూలం ఇచ్చేశారు.ఎవిడెన్స్ లను, సర్క్మ్టేన్షనల్ ఏవిడన్స్ , సాక్షుల వాజ్ఞ్మూలాలు మొదలైనవన్ని రంగారావుకు వ్యతిరేకంగా వుండటంతో డిఫెన్స్ లాయర్ శాస్త్రి కళ్ళు తేలేశాడు.

 నేను నిర్ధోషినని రంగారావు ఎంత మొత్తుకొన్న అది అరణ్యరోదనే అయింది. రంగారావుకు శిక్ష తప్పదని భార్య, కుటుంబసభ్యులు గొల్లుమన్నారు.

,తీర్పు రోజున బెంచిమీద జడ్జి చక్రపాణి గంభీరంగా ఎదో వ్రాసుకొంటున్నాడు. కోర్టుహాలంతా ఎలాంటి శిక్షపడుతోందోననే ఉత్కంఠతో వుంది. నాకిక ఉరిశిక్ష తప్పదని రంగారావు పళ్ళబిగువున ఏడుస్తున్నాడు.

జిడ్జి ఒక్కసారి గొంతు సవరించుకొని తీక్షణంగా రంగారావువైపు తిరిగి, తీర్పు చదివుతూ ఈ కేసులో పోలీసులు ప్రవేశపెట్టిన ఆధారాలు, సాక్ష్యులిచ్చిన వాజ్ఞ్మూలాలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు అన్ని రంగారావును దోషిగానే నిరూపిస్తున్నాయంటూ ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని కోర్టుహలంతా ఒక్కసారిగా పరిశీలించాడు. అందరి కళ్ళలో ఒకటే ఉత్కంఠ, కుటుంబసభ్యులలో భయం ఎలాంటి తీర్పు వినాల్సివుంటుందోనని...

జడ్జి చిన్నగా ఓసారి నవ్వి పోలీసులు ఎన్ని బలమైన సాక్ష్యాధారాలు చూపినా, సాక్షుల సాక్ష్యాలు ఎంత బలంగా వున్నా PP గారి వాదనా పటిమ ఎంత బాగున్నా ఈ హత్య రంగారావు చేయలేదని నేను విశ్వసిస్తున్నా,
కారణమేమిటంటే.... 

ఈ కథ పూర్వాపరాలు నాలాగా చదివిన వారెవరైనా ముగింపు నివ్వవచ్చు, లేదా మీరైనా ఊహించి ముగింపు పలకొచ్చు.
నాచే ఈ కథకు ముగింపు మాత్రం రేపే, అంతవరకు ఉత్కంఠతో ఆగాల్సిందే.


Credits: జి.బి.విశ్వనాథ.9

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి