ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఒకరిస్తే తీసుకునేది జ్ఞానం కాదు - మరి

బుద్ధుడు ఒకసారి అరణ్య మార్గం గుండా వెళుతున్నాడు. మధ్యలో విశ్రాంతి కోసం ఒక దగ్గర ఆగాడు. నీళ్ళు తాగి విశ్రమించి ప్రశాంతమయిన ప్రకృతిని పరిశీలిస్తున్నాడు. అంతలో అరణ్యమంతా కదిలినట్లు పెద్ద సంచలనం. జంతువులన్నీ పరేగిడుతున్నాయి. అంతా గందరగోళంగా ఉంది. 

ఎందుకు ఇంత మార్పుకు పరిగెడుతున్నాయో బుద్ధునికి అంతు పట్టలేదు అంతవరకూ నిశ్శబ్దంగా ఉన్న అరణ్యం అంతలో అలజడి ఎందుకు లోనయిందో? ఎందుకు ఏమి చూసి జంతువులు భయపడు తున్నాయో  ఏమి? ఏమైంది? ఎందుకు ప్రశ్న మొదలైనది .

బుద్దుడు దయ మూర్తీభవించినవాడు కదా! ఆయన్ని చూసి జంతువులు ఆయన తన ముందుగా పరిగెడుతున్న ఒక జింకను ఆపి 'ఏమి? ఏమైంది? పరిగెడుతున్నావు? కొంపలంటుకున్నట్లు ఎందుకు హడావిడి? 

అరణ్యమేమీ ... తగలబడిపోతుందా?' అని అడిగాడు.

ఆజింక "స్వామీ! నన్ను వెళ్ళనీ. వివరంగా చెప్పడానికి నాకు సమయం లేదు ఎదో ప్రళయం రాబోతుంది. ఇది ప్రపంచానికి చివరిరోజు. సమస్త సృష్టి సర్వనాశనం కాబోతుంది' అంది. 

బుద్ధుడు "సరే వెళ్ళు. కానీ ఈ సంగతి నీకెవరు చెప్పారు? - అన్నాడు. జింక "నా ముందు పరిగెడుతున్న జంతువులు చెప్పాయి" అంది. 

బుద్దుడు లేచి ముందుకు పరిగెట్టి చూశాడు. పులులు పరిగెడుతున్నాయి, సింహాలు పరిగెడుతున్నాయి. ఏనుగులు పరిగెడుతున్నాయి. వేటిని అడిగినా ప్రళయం రాబోతోందన్నాయి. ఎవరు చెప్పారంటే ఇంకో జంతు సమూహాన్ని చూపించాయి.

చవరగా ఒక కుందేలు గుంపు కనిపించింది. వాటికి ముందు ఆ గుంపునకు చెందిన నాయకుడు పరిగెడుతున్నాడు. బుద్ధుడు అతికష్టంమీద దాన్ని అపి "విషయమేమిటి?" అని అడిగాడు. ఆ కుందేలు "ప్రళయం రాబోతుంది. *రాబోతుందన్న సూచన నాకు తెలిసింది. అందరికీ చెప్పాను. అందరితో పాటు పరిగెడుతున్నా" అంది.*

బుద్దుడు "ఆ సూచన ఏమిటి? నీకెట్లా తెలిసింది?" అని అడిగాడు. ఆ కుందేలు స్వామి! ఈరోజు నేను మధ్యాహ్నం పూట ఒక చెట్టుకింద పడుకుని ఉంటే పెద్ద శబ్దం వచ్చింది. అప్పటిదాకా చల్లని గాలిలో నిద్రకు జోగుతున్నాను. ఆ శబ్దంతో నాకు మెలకువ వచ్చింది. 

చిన్నప్పుడు మా అమ్మ ఒక విషయం చెప్పింది నా మనసులో నాటుకుపోయింది. ఎప్పుడయితే పెద్ద శబ్దం వినిపిస్తుంది ప్రపంచానికి ప్రళయమొస్తుందని చెప్పింది. అచ్చం మా అమ్మ చెప్పినట్లే ఆ శబ్దం ఉంది. ప్రళయమొచ్చేసిందని పరిగెడుతున్నాను" అంది.

బుద్దుడు ఆ కుందేలును వెంటబెట్టుకుని అది పడుకున్న చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. చెట్లోనించీ ఒక పండు ఎండుటాకుల్లో పడి  ఉండడం చూశాడు. పండును పైకెత్తి మళ్ళీ ఆకుల్లో వదిలాడు దబి మని శబ్దం వచ్చింది. కుందేలు "అవును. ఇట్లాంటి శబ్దం వచ్చింది ..

బుద్ధుడు "ఇదే పండు ఎండుటాకుల్లో పడి శబ్దం  వచ్చింది" అన్నాడు 

పండు పడి శబ్దం చేసింది నువ్వు చూసి ఉంటే భయపడేదానివి కాదు. పెద్ద శబ్దం విని  ప్రళయమనుకున్నావు" అన్నాడు. 

మటల్ని మనవాళ్ళయిన విశ్వసించకూడదు. ఇతరుల మాటల్ని నమ్మి మనుషులు పరిగెడుతుంటారు.

మనకు సంబంధం లేనివి మనల్ని ప్రభావితం చేస్తాయి. మనిషికి సంబంధం లేనివి ఆందోళనకు గురిచేస్తాయి. ఎవరో ఏదో అంటారు. మనం బాధపడతాం. ఎవరో ఏదో అంటారు. 

మనం సంతోషిస్తాం. నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ అర్థం లేనివి. మనదంటూ ఏమీ లేదా? ఇతరుల్తో సంబంధంలేని, మనకు మాత్రమే సంబంధించినది మనలో లేదా? చిన్నప్పటినుంచీ మనుషుల్ని 'తయారు' చేస్తారు.

తయారుచేసిన మనుషులు యంత్రాలు, ఎదుటివాళ్ళు ఎట్లా మలిస్తే అట్లా మారుతారు. మనుషుల్ని సహజంగా పెరగనివ్వాలి. స్వతంత్రంగా పెరగనివ్వాలి. 

కనీ ధర్మాలు, నీతులు, మతాలు అన్నీ బోధించి మనుషుల్ని మరమనుషులుగా తయారుచేస్తారు. జ్ఞానమన్నది సహజం జ్ఞానమన్నది దానంతట అదే ఎదుగుతుంది. ఒకరిస్తే తీసుకునేది జ్ఞానం కాదు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి