బుద్ధుడు ఒకసారి అరణ్య మార్గం గుండా వెళుతున్నాడు. మధ్యలో విశ్రాంతి కోసం ఒక దగ్గర ఆగాడు. నీళ్ళు తాగి విశ్రమించి ప్రశాంతమయిన ప్రకృతిని పరిశీలిస్తున్నాడు. అంతలో అరణ్యమంతా కదిలినట్లు పెద్ద సంచలనం. జంతువులన్నీ పరేగిడుతున్నాయి. అంతా గందరగోళంగా ఉంది.
ఎందుకు ఇంత మార్పుకు పరిగెడుతున్నాయో బుద్ధునికి అంతు పట్టలేదు అంతవరకూ నిశ్శబ్దంగా ఉన్న అరణ్యం అంతలో అలజడి ఎందుకు లోనయిందో? ఎందుకు ఏమి చూసి జంతువులు భయపడు తున్నాయో ఏమి? ఏమైంది? ఎందుకు ప్రశ్న మొదలైనది .
బుద్దుడు దయ మూర్తీభవించినవాడు కదా! ఆయన్ని చూసి జంతువులు ఆయన తన ముందుగా పరిగెడుతున్న ఒక జింకను ఆపి 'ఏమి? ఏమైంది? పరిగెడుతున్నావు? కొంపలంటుకున్నట్లు ఎందుకు హడావిడి?
అరణ్యమేమీ ... తగలబడిపోతుందా?' అని అడిగాడు.
ఆజింక "స్వామీ! నన్ను వెళ్ళనీ. వివరంగా చెప్పడానికి నాకు సమయం లేదు ఎదో ప్రళయం రాబోతుంది. ఇది ప్రపంచానికి చివరిరోజు. సమస్త సృష్టి సర్వనాశనం కాబోతుంది' అంది.
బుద్ధుడు "సరే వెళ్ళు. కానీ ఈ సంగతి నీకెవరు చెప్పారు? - అన్నాడు. జింక "నా ముందు పరిగెడుతున్న జంతువులు చెప్పాయి" అంది.
బుద్దుడు లేచి ముందుకు పరిగెట్టి చూశాడు. పులులు పరిగెడుతున్నాయి, సింహాలు పరిగెడుతున్నాయి. ఏనుగులు పరిగెడుతున్నాయి. వేటిని అడిగినా ప్రళయం రాబోతోందన్నాయి. ఎవరు చెప్పారంటే ఇంకో జంతు సమూహాన్ని చూపించాయి.
చవరగా ఒక కుందేలు గుంపు కనిపించింది. వాటికి ముందు ఆ గుంపునకు చెందిన నాయకుడు పరిగెడుతున్నాడు. బుద్ధుడు అతికష్టంమీద దాన్ని అపి "విషయమేమిటి?" అని అడిగాడు. ఆ కుందేలు "ప్రళయం రాబోతుంది. *రాబోతుందన్న సూచన నాకు తెలిసింది. అందరికీ చెప్పాను. అందరితో పాటు పరిగెడుతున్నా" అంది.*
బుద్దుడు "ఆ సూచన ఏమిటి? నీకెట్లా తెలిసింది?" అని అడిగాడు. ఆ కుందేలు స్వామి! ఈరోజు నేను మధ్యాహ్నం పూట ఒక చెట్టుకింద పడుకుని ఉంటే పెద్ద శబ్దం వచ్చింది. అప్పటిదాకా చల్లని గాలిలో నిద్రకు జోగుతున్నాను. ఆ శబ్దంతో నాకు మెలకువ వచ్చింది.
చిన్నప్పుడు మా అమ్మ ఒక విషయం చెప్పింది నా మనసులో నాటుకుపోయింది. ఎప్పుడయితే పెద్ద శబ్దం వినిపిస్తుంది ప్రపంచానికి ప్రళయమొస్తుందని చెప్పింది. అచ్చం మా అమ్మ చెప్పినట్లే ఆ శబ్దం ఉంది. ప్రళయమొచ్చేసిందని పరిగెడుతున్నాను" అంది.
బుద్దుడు ఆ కుందేలును వెంటబెట్టుకుని అది పడుకున్న చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. చెట్లోనించీ ఒక పండు ఎండుటాకుల్లో పడి ఉండడం చూశాడు. పండును పైకెత్తి మళ్ళీ ఆకుల్లో వదిలాడు దబి మని శబ్దం వచ్చింది. కుందేలు "అవును. ఇట్లాంటి శబ్దం వచ్చింది ..
బుద్ధుడు "ఇదే పండు ఎండుటాకుల్లో పడి శబ్దం వచ్చింది" అన్నాడు
పండు పడి శబ్దం చేసింది నువ్వు చూసి ఉంటే భయపడేదానివి కాదు. పెద్ద శబ్దం విని ప్రళయమనుకున్నావు" అన్నాడు.
మటల్ని మనవాళ్ళయిన విశ్వసించకూడదు. ఇతరుల మాటల్ని నమ్మి మనుషులు పరిగెడుతుంటారు.
మనకు సంబంధం లేనివి మనల్ని ప్రభావితం చేస్తాయి. మనిషికి సంబంధం లేనివి ఆందోళనకు గురిచేస్తాయి. ఎవరో ఏదో అంటారు. మనం బాధపడతాం. ఎవరో ఏదో అంటారు.
మనం సంతోషిస్తాం. నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ అర్థం లేనివి. మనదంటూ ఏమీ లేదా? ఇతరుల్తో సంబంధంలేని, మనకు మాత్రమే సంబంధించినది మనలో లేదా? చిన్నప్పటినుంచీ మనుషుల్ని 'తయారు' చేస్తారు.
తయారుచేసిన మనుషులు యంత్రాలు, ఎదుటివాళ్ళు ఎట్లా మలిస్తే అట్లా మారుతారు. మనుషుల్ని సహజంగా పెరగనివ్వాలి. స్వతంత్రంగా పెరగనివ్వాలి.
కనీ ధర్మాలు, నీతులు, మతాలు అన్నీ బోధించి మనుషుల్ని మరమనుషులుగా తయారుచేస్తారు. జ్ఞానమన్నది సహజం జ్ఞానమన్నది దానంతట అదే ఎదుగుతుంది. ఒకరిస్తే తీసుకునేది జ్ఞానం కాదు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి