ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బుద్ధుడు ఖచ్చితంగా చెపుతాడు .. ఏమని ?


ఏది చర్య ......ఏది ప్రతిచర్య..!?

బుద్ధుడు ఖచ్చితంగా చెపుతాడు.. నిశ్శబ్దంగా కూర్చోవటం నేర్చుకోమని.

అంటే ఎప్పుడూ నిశ్శబ్దంగా కూర్చోమని  కాదు. మీరు సోమరితనంగా వుండమని కాదు. 

ఆ నిశ్శబ్దం నుండి మొదలయ్యేదే చర్య అంటాడు. 

మీకా నిశ్శబ్దం తెలీకపోతే; 

ఆ ప్రశాంతత.. నిశ్చలత్వం.. తెలీకపోతే; 

మీరేమి చేసినా అది ప్రతిచర్య అవుతుంది.


ఎవరో మిమ్మల్ని అవమానిస్తారు. 

మీకు కోపమొస్తుంది. 

ఎవరో మిమ్మల్ని పొగుడుతారు. 

మీకు సంతోష మొస్తుంది. 

ఎవరో మిమ్మల్ని కించ పరుస్తారు  

మీరందుకు కుంగిపోతారు.

అంటే ఎవరో స్విచ్ నొక్కుతారు. 

మీరందుకు స్పందిస్తారు.  


అంటే..

ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. 

బాధ పెట్టగలరు. 


మీలో ద్వేషాన్ని రగిలించ గలరు.


మిమ్మల్ని పిచ్చివారిని కూడా చేయ గలరన్న మాట. 


ఇతరులననుసరించి మీరు స్పందిస్తూ వున్నారంటే,  

ఇతరులప్రభావంతో మీ ప్రవర్తన వుందనికదా అర్ధం.


ఇదంతా మీ చర్య ఎలా అవుతుంది..?

ప్రతిచర్య  అవుతుంది గానీ!


బుద్ధుడు దీనిపై స్వీయపరిశోధన చేసాడు.


ఆ ప్రకారం బుద్ధుడు ఓ రోజు ఓ గ్రామం మీదుగా వెళుతున్నాడు. 


బుద్ధుని తత్వం అర్ధంకాని వారికి బుద్ధుడొక పనిపాటలేని ఓ సోమరిలా అనిపించాడు. పైగా బోధనలంటూ అందరినీ చెడగొడుతున్నాడు కూడాను. ససేమిరా అది నచ్చని వారంతా దారికాసి.. బుద్ధుడిని నానా తిట్లూ తిట్టారు. ప్రశాంతంగా అన్నీ విన్నాక బుద్దుడు అన్నాడు..


"మీరంతా ఇంతదాకా వచ్చి.. నాకోసమని ఇంత సమయం వెచ్చించి నందుకు ధన్యవాదాలు. నేనిపుడు మరో గ్రామానికి వెళ్ళాలి. అక్కడా మీలా కొందరు నా కోసం ఎదురు చూస్తూ వున్నారు. రేపు వచ్చి వింటాను ఇంకా మిగిలినవన్నీ"

గ్రామస్తులు నిర్ఘాంత పోయారు. ఏమిటీ మనిషీ!? అసలు మనిషేనా..అదే విషయం  అడిగేసారు.. 

సరే! కనీసం ఈ ఒక్కటీ చెప్పు. మేమిన్ని మాటలన్నాం కదా.. కనీసం ప్రతిగా ఒక్క మాటైనా లేదా నీవద్ద..!

నిజమే! మీకు నా జవాబు కావాలంటే 10 ఏళ్ళ క్రితం వచ్చి ఉండాల్సింది.. నావద్దకి. ఇప్పుడా మనిషి లేడిక్కడ.  ఈ పదేళ్ళ కాలంలో నాలో ఇతరులవల్ల ప్రభావితం కావటమనే లక్షణం పోయింది. నాపై నేను మాత్రమే అధికారినిపుడు. నాకు నచినట్టుగా నేను ప్రవర్తిస్తాను. ఇతరుల వల్లకాదు. నా అంతర్గత అవసరాలకు అనుగుణంగా నేను నడుచుకొంటాను.

మీరు నన్ను తిట్టాలనుకున్నారు. తిట్టారు. 

అందుకు మీరు సంతృప్తి పడండి. 

మీ పని మీరు చక్కగా చేశారు.. 


ఐతే ఆ అవమానాన్ని నేను స్వీకరించలేదు. 

అలా స్వీకరించనంత వరకు నాకది అర్ధరహితమైనదే కదా. 

ఎవరైనా స్పందించారూ అంటే.. 

వారా అవమానాన్ని స్వీకరించారనీ, అంగీకరించారని కదా అర్ధం!


ఎవరైతే ఎరుకతో లేరో వారే కదా స్పందిస్తారు. 


గ్రామస్తులంతా అవాక్కయ్యారు. ప్రత్యుత్తర మివ్వటానికి  వారివద్ద మరేమీ మిగలలేదు.

బుద్ధునికి పాదాభివందనం చేయటం మినహా! 


స్పృహలో లేని వ్యక్తే స్పందిస్తాడు.

బుద్ధిజీవి గమనిస్తాడు.

అతడి అంతర్గత శాంతినుండి నిశ్శబ్దంనుండీ..,..ఎరుక నుండీ.. అతడి చర్య పుడుతుంది.

స్వాభావిక ప్రవర్తన పుడుతుంది.

ఇతరులు ప్రభావితం చేయటం వల్ల కాదు.

ఇతరుల వల్ల కలిగేది ప్రతిచర్య మాత్రమే!

చర్య .......ప్రతిచర్యల కున్న తేడా ఇక్కడే.........

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి