ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సహాయం చేయడం ఉత్తముల ప్రధాన లక్షణం




సహాయం చేయడం ఉత్తముల ప్రధాన లక్షణం మరి సహాయం పొందేవారు సైతం ఉత్తములై ఉంటె ఎంత బావుంటుంది 

కామరాజర్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను చూడడానికి కొందరు ఇంటికి వెళ్లి పలకరించేవారు  
అయన ప్రతి ఒక్కరిని చాల ఆప్యాయతతో సగర్వంగా ఆహ్వానించి  గౌరవమర్యాదలు చేసేవారు 

ఒకసారి ఒక పాప బాబు  ఆయనను కలవడానికి వెళ్ళగా వారిని గుమాస్తా  లోపలకు  పంపించకుండా  బయటకు తరిమేశారు  
పిల్లలు పాపం గేట్  దగ్గర ఆగిపోయి ఇంటివైపు చూస్తూ ఉండిపోయారు  

ఇంటికి వచ్చిన అతిథులను బయట వరకు వచ్చి సాగనంపడం  కామరాజర్  గారి అలవాటు అలా బయటకు వచ్చినప్పుడు ఈ పిల్లలను చూసి లోపలకు పిలిపించారు  

ఎవరిని కలవడానికి  వచ్చారు అని అడగగా 
అయ్యామిమ్మల్నే కలవాలని వచ్చాము  అని చెప్పారు 
విషయం ఏంటని అడగగా 
నాన్న తాగుతూ  చనిపోయారని 
అమ్మ నాలుగు ఇళ్లల్లో  పాచిపనిచేస్తూ  ఉంటారని
అన్న టైపురైటింగ్ పరీక్షకు  ఫీజు  కట్టాలని  
కడితేనే పరీక్షా  రాయగలడని అమ్మ దగ్గర డబ్బులు లేవని ఆ పసిపాప చెప్పింది 

అమ్మ ఇలా అడగమనిచెప్పిందా  అని అయన అడిగారు 
లేదు అయ్యా మేమె వచ్చామని పాప చెప్పింది 
సరే అని అయన 1500 డబ్బులు ఒక కవర్  లో పెట్టి ఫీజు కట్టేసి  మిగిలిన  డబ్బులు అమ్మకు  ఇవ్వమని చెప్పారు 

మరుసటి రోజు మళ్ళీ ఆ పిల్లలు గేట్ దగ్గర ఉండడం గమనించారు
గుమాస్తా చూసారా  అయ్యా ఒక్కసారి డబ్బు ఇచ్చి అలవాటు చేశారు వారు రోజు వస్తున్నారని చెప్పాడు 

పిల్లల్ని పిలిచి అడగగా ఫీజు కట్టిన రశీదును  మీకు చూపించి  మీకు కృతజ్ఞత చెప్పిరమ్మని అమ్మ చెప్పారని ఆ పిల్లలు రసీదు  చూపించగా
పేదరికంలోనూ ఇంతటి నిజాయితినా  అని కంటతడి  పెట్టి వారికి నమస్కరించారు  



సోనూసూద్ సైతం కష్టమని  అనిపించిన కనిపించిన ప్రతిఒక్కరికి సాయం చేస్తున్నారు కానీ తీసుకునేవారు అంతే  నిజాయితీగా ఉంటె  బావుండనిపిస్తుంది

కలికాలం నటనతో  సాయం చేసేవారిని  మోసంచేయకండి  దయచేసి నిజాయితీగా సాయం పొందవలసిన ఎంతో మంది మీ ఒక్కరి  నటన వల్ల మోసపోయే  అవకాశాలే  ఎక్కువ..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి