ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

"మెంటల్ ఏజ్..."

ఏయ్ చిట్టి చిన్నారి అక్కా.... బాగున్నావా .....  నన్ను అందరూ గేలి చేస్తున్నారు .... మెంటల్ ఏజ్ పెరగాలి అంటున్నారు ... ఏమిటే అది ..... 

ఒరేయ్ కన్నా.... శారీరక వయస్సు, మానసిక వయస్సు అని రెండు రకాలు. 

స్కూల్ లేక నీకు కొన్ని పాఠ్యాంశాల మీద అవగాహన లేక తెలీక పోవచ్చు. 

నువ్వు పుట్టిన రోజుకు వేరొక రోజు అడిషన్ చేస్తే వచ్చేది నీ శారీరిక వయస్సు. ఆ పెరుగుదలకు నీ ప్రేమయం లేదు.

కానీ.  మానసిక వయస్సు ...నీ ప్రవర్తన, జీవిత అనుభవాలు, కష్ట నష్టాలు, జీవితంలో తగిలిన  ఎదురు దెబ్బలు ఇత్యాది విషయములతో కూడుకొని .... ఏ రకముగా పుష్పం పిందిగా, కాయగా , ఫలంగా పరిపక్వత చెంది అది ఏ ఉద్దేశ్యంతో ఈ భూభాగం మీద ఉద్భవించ్చిందో ఎరింగి ఇతరులకు తీపి రుచిని ఇచ్చి వారి మనసు ఉల్లాసం కలిగించిన ప్రతీ క్షణం కూడా పెరుగుతూ వుంటుంది ....

 బట్...శారీరిక వయస్సు అంత వాస్ట్ గా కాకుండా .... చాలా స్లో పేస్ లో పెరుగుతుంది. 

అందుకనే నువ్వు అబ్జర్వ్ చేసే వుంటావు..... కొంత మంది వయస్సుకు తగ్గట్లుగా బిహేవ్ చేయట్లేదని విజ్ఞులు అయిన వాళ్ళు పసికడుతూ వుంటారు. 

టీనేజ్ వరకు శారీరిక వయస్సు ప్రోపోర్షనెట్ గా మానసిక వయస్సు పెరగి పుష్పం కాయగా మారే ప్రక్రియ జరగాలి . అంటే ఆ వయస్సులో వచ్చే ఒడిదుడుకులు చాకచక్యంగా దాటుకొని .... మెచూరిటీ పొందాలి .   

ఆ తదుపరి కొంతకాలం ఆ మెంటల్ ఎజే స్టాండర్డ్ చేసుకొని; ఉద్యోగం, ఇతర సంసార బాధ్యతలప్పుడు .... బాలన్స్ గా వుండి.... మంచి,చెడు సంస్కారములు గ్రహించుకుంటూ .... కొద్ది కొద్దిగా ప్యూరిఫై గా ఆ వయస్సు పెరగటానికి దోహదం చేయాలి.... ఈ ప్రక్రియ నీ చేతులోనే వుంది.  నీకు అండగా కుటుంబ సమాజ నైజం , సత్పురుషుల జీవిత పాఠాల శ్రవణ, అనుకరణ దోహదం చేస్తాయి. 

ఒరేయ్ పొట్టి పోకిరి ......అద్భుత విషయం నీకు చెప్పమంటావా .... కొంత మంది చిన్నతనంలోనే వారి ఆలోచనలు చాలా పరిపక్వత కలిగి ....ఇతరులకు సలహాలిచ్చే స్థాయిలో వుంటారు..... వారి జీవితం కడు ఆనందం. ఎన్ని ఒదుదుడుకులు వచ్చినా.... తొనకని నీటి కుండ లాంటి వారు వారలు.  

కానీ ... ఇప్పటి యువతరం కెరీర్ అంటే మంచి ఉద్యోగం, సంపాదన, లగ్జరీ లైఫ్ అనే భావనలో వున్నారు. దానితో పాటు సమాజ ఆమోదయోగ్యమైన కార్యములు ద్వారా .... సత్పురుషుల సభ్య సమాజంలో మెంబర్ షిప్ తీసుకోవటం తప్పని సరి అని తెలేట లేదు.... మరి దానికి ఎలి జిబిలిటీ క్రైటీరియా... మెచ్యూరేడ్ బిహేవియర్ అండ్ హై  మెంటల్ ఏజ్ అని తెలియచెప్పే కోచింగ్ సెంటరే ఈ మన జ్ఞాన కేంద్ర కుటుంబ వేదిక. 

 వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన వారలు, వారి స్వీయ జీవిత అనుభవాలను, అకడమిక్స్ కి జోడించి చెప్పే ప్రయత్నం చేస్తారు.... 

అబ్బా.... నాకు అర్ధమైందే.... నేను కూడా పది మందికి ఈ విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేస్తాను... వినే వారు జీవితాలైన ఆనందమయంగా వుంటే.... మన పిచ్చోడు సూరపరాజు ఈ కష్టానికి కొంత వరకు ఫలితం దక్కితే... నా పుట్టుకకు సార్ధకత వుంటుంది.... 

ఉంటా మరి....



Credits: Telegram User సూరపరాజు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి