ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మనం సృష్టించిందే మనకంటే గొప్పదైతే కాదు కదా..... ఏమిటి అది ?

 

ఒకప్పుడు పిల్లలు ఏడుస్తుంటే  ఆ పిల్లలకు చిన్న కథలు చెప్పి మాటలు చెప్పి ఏడుపు మాన్పించేవారు  

మొండి చేస్తున్న పిల్లలకు పక్షులను  వీధిలో  వెళ్లే చిన్న చిన్న జంతువులను  చూపించి ఆ వైఖరిని  మార్చేవారు  

అన్నం  తినిపించాలంటే కథలు 

నిద్ర పుచ్చాలంటే అమ్మమ్మ  తాతయ్య  కథలు చెప్పేవారు  

ఇంకా ఎక్కువ మారాం  చేస్తే నాలుగు పడితే  దారిలోకి  వచ్చేవాళ్ళు  

ఇప్పుడేమో పిల్లలకు ఈ సెల్ల్ఫోన్  ని బాగా అలవాటు  చేసారు

 

ఇప్పుడేమో దేనికైనా ఆ ఫోనే

బిడ్డ ఏడిస్తే ఫోన్ 

అన్నంతినాలంటే ఫోన్ 

నిద్రపోవాలన్నా ఫోన్ 

ఎందుకు ఇలా చేస్తారు  అని అడిగితే క్షణాల్లో ఏడుపు ఆపేస్తారండి

మారం చేయకుండా  తినేస్తారండి  

ఫోన్ చూస్తూ నిద్ర పోతారండి  అని 


ఇలా అన్ని మీరే అలవాటు చేసి  పిల్లలు చెడిపోవడానికి  కారణం  ఫోన్ అనిఎంత తేలికగా  చెప్పేస్తారండి 

ఆ తప్పు ఫోన్ అలవాటు చేసిన మీది  కాదా ???


టెక్నాలజీ  ఎంత మారిందంటే  

మంచిని చూపెడుతుంది 

చెడును చూపెడుతుంది  

ఎంచుకునే మనలోనే  ఉంది మనం మంచి మార్గంలో  నడుస్తామా లేక చెడిపోతామా అని 


పిల్లలకు సాధ్యమైన  అంత వరకు కాదు అసలు ఫోన్ ఇవ్వకండి

పిల్లలకు ఫోన్ కొనివ్వడం  ఇప్పటి పెద్దలకు ప్రెస్టేజ్ 


 మానుకోండి మొదట మీరు ఈ ఆలోచన తీరును

మారం చేస్తున్నారా ఏడుస్తున్నారా వారికీ  దగ్గరగా కూర్చుని మాటలు కలపండి   

కథలు వినిపించండి 


ఒక స్కూల్  లో ఇద్దరు  పిల్లలు 

ఒక పాపా  మరో పాపతో మా నాన్న  నాకు పెద్ద లాప్టాప్ కొనిచ్చారు అందులో కథలుంటాయి  ఆటలుంటాయి  పాటలుంటాయి  అని చెప్పింది 

నీదగ్గర ఏముంది అని అడిగినప్పుడు ఆ చిన్నారి ఇవన్నీ నాకు చెప్తూ పాడుతూ ఆడుతూ మా నాన్న నా దగ్గరే  ఉన్నారు అని చెప్పింది 

ఎంత ఆనందం ఆ మాట  


తాత్కాలిక ఆనందం మీ పిల్లలకు ఇవ్వకండి 

కొట్టడమో తిట్టడమో  ప్రేమించడమే పక్కనే ఉండి తియ్యనైన  జ్ఞాపకాలను మీ పిల్లలకు జీవితాంతం  గుర్తుండేలా  ఇవ్వండి 

అవి వారి పిల్లలకు సైతం మధురమైన స్మృతులుగా  అందిస్తారు  

ఒక్కసారి ఆలోచించండి

నేటి ఈ పోటీ ప్రపంచంలో  కుదరదు అని చెప్పకండి 

ఏదైనా ఈ పోటీని  మనం సృష్టించిందే మనకంటే  గొప్పదైతే కాదు కదా.....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి