నడకలో రాజసం, వేటలో గాంభీర్యం ప్రదర్శించే పెద్దపులి ఉన్నచోట ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. జంతు, జీవజాలం సమతుల్యంగా ఉంటుంది. దట్టమైన అడవులతో నిండుకొని విస్తారమైన వర్షాలు కురుస్తాయి.
పులి సంచరించే ప్రాంతంలోకి స్మగ్లర్లు, వేటగాళ్లు ప్రవేశించే సాహసం చేయరు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన పులిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. పులుల సంరక్షణపై సరైన అవగాహన కల్పించే విధంగా ఏటా జులై 29న (2010 నుంచి) పులుల దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు.
దేశంలో ఇప్పుడు సుమారు మూడు వేల పైచిలుకు పులులు ఉన్నాయని, పులులకు అతిపెద్ద, సురక్షిత నివాస ప్రాంతాల్లో భారత్ ఒకటని ప్రధాని చెప్పారు.
ప్రపంచంలోని మొత్తం పులుల్లో దాదాపు 70 శాతం ఒక్క భారత్లోనే ఉన్నాయన్నారు.
అఖిల భారత పులుల అంచనా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
పులుల సంఖ్య రెట్టింపు కావడం భారత్కు చరిత్రాత్మక విజయమని, పులుల సంరక్షణ పట్ల భారత్ అంకితభావాన్ని ఇది చాటుతోందని మోదీ చెప్పారు. పులుల సంఖ్యను 2022లోగా రెట్టింపు చేయాలని తొమ్మిదేళ్ల క్రితం సెయింట్ పీటర్స్బర్గ్లో లక్ష్యంగా నిర్ణయించారని, కానీ భారత్ నాలుగేళ్లు ముందుగానే ఈ లక్ష్యాన్ని అందుకుందని ఆయన ట్విటర్లో తెలిపారు.
అభివృద్ధికీ, పర్యావరణానికీ మధ్య ఆరోగ్యకర సమతౌల్యాన్ని తీసుకురావడం సాధ్యమేనని
ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు.
భారత్ ప్రతీ నాలుగోళ్లకోసారి పులుల సంఖ్యను లెక్కిస్తుంది. సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గణన సాగుతుంది. ఒక అంచనా ప్రకారం- 1875 నుంచి 1925 మధ్య దాదాపు 80 వేల పులులు వేటగాళ్ల బారిన పడి మరియు ఇతర కారణాలతో చనిపోయాయి. 1960ల నాటికి పులుల సంఖ్య భారీగా పడిపోయింది.
నేటి లెక్కల ప్రకారం 2,367 పులులు భారత్ లో ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.
వేటపై నిషేధం, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన ఇతర సంరక్షణ చర్యలు పులుల సంఖ్య తిరిగి పెరడగానికి తోడ్పడ్డాయి. ఈ ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నట్లు తొలిసారిగా 2006లో స్పష్టంగా కనిపించింది.
మన జాతీయ జంతువైన పెద్దపులిని కాపాడుకుందాం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి