ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎపుడో నలభై ఎండ్ల క్రిందటి మాట.ఆవునుతిన్న పులికథ.

ఎపుడో నలభై ఎండ్ల క్రిందటి మాట.ఆవునుతిన్న పులికథ.



దాదాపు నలభై సంవత్సరాల క్రిందట అనుకొంటా రావుకొండలరావు గారి కథ ఒకటి యువ మాసపత్రికలో ప్రచురితమైంది. కథపేరు గుర్తు లేదుకాని  కథనంమాత్రం చాలా బాగా గుర్తుంది నాకు.


ఇది మనకు తెలిసిన ఆవు పులిలాంటి కథే అయినా ముగింపు మాత్రం పులి సహజధోరణి, ప్రవర్తన ఎలా వుంటుందో రావు కొండలరావుగారు అద్భుతంగా చూపారు. ఇంతకు కథ ఏమిటంటే...

గోవు ఒక్కటి అడవిలో మేతమేసుకొని ఇంటిదగ్గరున్న లేగదూడకు పాలివ్వటానికి ఆ సాయంత్రం వడివడిగా వస్తోంది. దార్లో ఆవును పులి అడ్డగించి బాగా ఆకలిగావుంది, నిన్ను తినేస్తానంది.

పుట్టిన ప్రతిప్రాణి ఎప్పుడో ఒకపుడు గిట్టకమానదు.పరుల ఆకలి తీర్చటానికి నా శరీరం ఉపయోగపడుతుందంటే అంతకంటే నాకింకేమి కావాలి అని ఆ ఆవు అంటూ 

ఓ పులిరాజా నన్ను తిని నీ ఆకలితీర్చుకో, అయితే నాదో చిన్నమనవి ఇంటిదగ్గర ఆకలితో నా దూడ నా కోసం కాచివుంది. త్వరగా వెళ్ళి నా బిడ్డకు పాలిచ్చి, నాలుగు బుద్ధిమాటలు చెప్పి వచ్చేస్తాను అనుమతివ్వు అంటూ ప్రాధేయపడింది.



తప్పించుకోటానికి ఇదో ఎత్తు కుదరదు, వెళ్ళటానికి వీల్లేదంటూ గర్జించిందా పులి. దానికా గోమాత పులిరాజా నేను గోమాతను ఆడిన మాట తప్పను ఈ సూర్యచంద్రులు భూమ్యాకాశాలు మీద ఆన, నేను తప్పక తిరిగివస్తా నన్ను వెళ్ళనివ్వు అంటూ దీనంగా ప్రాధేయపడిందా ఆవు.

పులిరాజు ఏ కళనున్నాడో సరేనన్నాడు. ఆవు పరువులెత్తి లేగదూడకు పాలిచ్చి పులికి తాను ఇచ్చిన మాట గురించి చెప్పి నాయనా అమ్మలేని వాడు దూది కంటే దుమ్ముకంటే చులకన. అందుకే దుష్టసహవాసం చేయెద్దు. చెడు అలవాట్లనేర్చుకోవద్దు, బావులగట్ల వెంబడి మేతకు పోవద్దు, ఆడిన మాట తప్పకు అంటూ కన్నీళ్ళతో బోధించింది. ఏం చేయాలో తోచక దూడ చిట్టి హృదయం బాధతో నిట్టూర్చింది. దూడ కళ్ళల్లో కన్నీళ్ళ ధార, ఆవు కంఠంలో గద్గత. ఆవుదూడలు ఏడ్చుకొంటూ పరస్పరం వీడ్కోలు చెప్పుకొన్నాయి.

ఆవు పులి దగ్గరకు వచ్చింది. గోమాత నిజాయితికి, సత్యవాక్పరిపాలనకు పులి ఆశ్చర్యపడింది. ఇలాంటి సచ్ఛీలురాలునా నేను తిని ఆకలి తీర్చుకోనేది అంటూ ఆలోచించి ఆవు మంచి హృదయాన్ని చూచి భోరున ఏడుస్తూ, అమ్మా గోమాత నీలాంటి మంచివారిని ఆడిన మాట తప్పనివారిని నేను తినను నువ్వు స్వేచ్ఛగా వెళ్ళినీ బిడ్డను కలుసుకోవచ్చు అంటూ కాళ్ళమీద పడింది.

అమ్మా గోమాత నిన్ను నాకు ఆహారంగా పంపిన లేగదూడను ఒకసారి చూడాలనుంది.పిలుచుకు రా ఒక్కసారంటూ అడిగింది.

ఆవు దానికేం భాగ్యమంటూ ఇంటికి వెళ్ళి పులి మంచితనం గురించి తెలియచేసి ఒక్కసారి నిన్ను చూడాలని ఆ వ్యాఘ్రం కోరుతోంది వెళదాం రా అంటూ చిట్టిదూడను పులివద్దకు తీసుకువెళ్లింది.

ఆవుదూడను చూడగానే ఆ శార్ధూలం బిగ్గరగా గాండ్రించి పంజావిసిరి  ఆవుదూడను ఒక్క దెబ్బతో చంపేసి దూడను టిఫిన్ గాను, గోమాతను భోజనంగాను తినేసింది.

ఇది నేటిసమాజంలో నీతినిజాయితికి వున్న విలువ.

*నిన్నటి రోజున (28:7: 2020 ) న మహనాటక రచయిత విలక్షణనటుడైన రావు కొండలరావుగారు కనుమూసారు. వారికి స్వర్గప్రాప్తి కలగాలని ప్రార్థిద్ధాం.*
.............................................................................................................

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి