జూన్ 3 న ఇంగ్లండ్ పార్లమెంట్ భారతదేశవిభజనకు అమోదం తెలిపింది. దానికి దాదాపు సంవత్సరకాలం అంటే జూన్ 1948 వరకు గడువు విదించింది.దానికి అనుగుణంగా రాడ్ క్లిప్ ను నియమించడం జరిగింది.
ఈ సిరిల్ రాడ్ క్లిఫ్ అనే ఆయన పెద్ద న్యాయకోవిధుడుకూడా కాదు.బ్రిటన్ లో పెద్దపేరున్నవాడూకాదు. అంతకముందు భారత్ కు ఎప్పుడూ రాలేదు.భారతీయ సంస్కృతి ,సాంప్రదాయాలు,భావోద్రేకాల మీద అసలు అవగాహనలేదు.మౌంట్ బాటన్ రాడ్ క్లిప్ పేరు చెప్పగానే ,వెంటనే జిన్నా ఒప్పేసుకోవడం నాటి రాజకీయ విశ్లేషకులకు అనుమానాలొచ్చాయి.అయితే నెహ్రుా లాంటి నాయకులు కొంచెం కూడా అనుమానించలేదు.కానీ లండన్ లో జిన్నా లాయర్ గా వున్నప్పుడు ఈ రాడ్ క్లిఫ్ అతని దగ్గర జూనియర్ గా వుండేవాడని విమర్శలు వచ్చాయి.జిన్నా ఆ ఆరోపణలను ఎప్పుడూ ఖండించలేదు. జూలై-2 న పాక్ గవర్నర్ జనరల్ గా జిన్నా పట్టుబట్టి నియమించుకున్న తరువాత మౌంట్ బాటన్ అధికారం పాక్ పై లేకుండా పోయింది. జిన్నా అక్కడ నుండి చక్రం తిప్పాడు.రాడ్ క్లిఫ్ తో ఉన్న పరిచయంతో తనకు అనుకుాలంగా కొన్ని నిర్ణయాలు తీసుకొనేటట్లు చేసుకున్నాడు. కానీ ఇది తెలియని కాంగ్రీసునాయకులు తూర్పు బెంగాల్ ,చిట్టిగాంగ్ ,పంజాబ్ ,సింధు,వాయవ్యసరిహద్దులలో గణనీయంగా వున్న హిందూ-సిక్కుమతస్థులకు ఏమీకాదని చెప్పసాగారు. వారు కూడా కాంగ్రీసునాయకులను నమ్మి ఉదాసీనంగా వుండసాగారు.
అయితే లాహోర్ లో హిందూ-సిక్కుమతస్థులు ఎక్కువగా ఉన్నందున అక్కడ ముస్లిం లీగ్ నాయకులందరూ కరాచీకి మకాం మార్చారు.అందువల్ల సిక్కుహిందువులు తాము భారత్ లోనే వుంటామనే నమ్మకం మరింత బలపడింది.అయితే 1948 జూన్ వరకు వున్న విభజన తతంగాన్ని మౌంట్ బాటన్ 1947 ఆగష్టు 15 వరకే కుదించాడు. ఈలోపల విభజన మ్యాప్ ను బయటపెట్టద్దని రాడ్ క్లిఫ్ కు ఆదేశాలిచ్చాడు.ఈవిధంగా జూలై 15 న ఇద్దరు ముస్లిమ్ ,ఇద్దరుహిందూ హైకోర్టు న్యాయమూర్తుల సలహాదారులతో రాడ్ క్లిప్ విభజన భారత్ పటాన్ని తయారుచేసారు. అయితే అతను శాస్త్రీయంగా ఎటువంటి పద్దతులూ అవలంబించలేదు. అలాగే ఏ ఒక్కప్రాంతం సందర్శించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోలేదు.
1947 ఆగష్టు 17 న మౌంట్ బాటన్ సమక్షంలో రాడ్ క్లిఫ్ తన మ్యాప్ ను ప్రదర్శించాడు. అందులో ఒకేఒక గీతతో ఒక ఇల్లునే సగం పాక్ భూభాగంగా,సగభాగం ఇండియా భూభాగంగా విడగొట్టబడింది.ఆశ్చర్యంగా లాహోర్ పాక్ కు ఇవ్వబడింది. అది తెలిసి తూర్పుపంజాబ్ బగ్గుమంది. 40% సిక్కులు,హిందువులు తమ భూములను కోల్పోయి బిక్షగాళ్ళగా మారిపోయారు.తూర్పు బెంగాల్ ,చిట్టగాంగ్ లోని హిందువులంతా హతాసులైనారు.
అయితే ఇక్కడ ఒక అశాస్త్రీయమైన పద్ధతిని అనుసరించడం జరిగింది. అదేమిటంటే విభజనకు 1931 నాటి జనాభా లెక్కలను తీసుకోమనడం. అయితే 1931 లో మతపరమైన జనాభా లెక్కలను కాంగ్రీసు వ్యతిరేఖించి ప్రజలందరూ జనాభా లెక్కలను బహిష్కరించమని పిలుపు ఇచ్చింది. అందువలన చాలామంది సిక్కులు,హిందువులు జనభాలెక్కలను బహిష్కరించారు.కానీ ముస్లిమ్ లీగ్ నాయకులు భారీగా ముస్లిమ్ జనాభాను నమోదుచేయంచారు. దానితో పాక్ కు భారీగా పంటభూములు దక్కినవి. తూర్పుపంజాబ్ లో మతఘర్షణలు తలెత్తి హింసాత్మకంగా మారాయి..అపారమైన ప్రాణమాన ఆస్థుల నష్టం జరిగింది. ప్రజలకు సంబంధం లేకుండా రాజకీయనాయకులు ఆడిన నాటకంలో అమాయకప్రజలెందరో అసువులుబాసారు. ఢిల్లీ ఇవ్వనందుకు జిన్నా అలిగి కొన్ని ఒప్పందపత్రాలపై సంతకాలు చేయకుండా వెళ్ళిపోయాడు..మౌంట్ బాటన్ తను చేయాల్సింది చేసేసాడు.భారత్ రెండు దేశాలుగా చీలి అధికారబదిలీ జరిగింది ఈ రోజే.
అయితే భారతీయుల సెంటిమెంట్స్ తెలియని రాడ్ క్లిఫ్ విభజన తర్వాత తలెత్తిన భారీ హింసాకాండను చూసి చలించిపోయాడు.ఇంక జీవితంలో ఇలాంటి విషయాల జోలిగా పోనని ప్రకటించాడు. తనకు ప్రకటించిన 3000 పౌండ్ల పారితోషికాన్ని తీసుకోలేదు. ఇదీ దేశవిభజన కథ. ప్రజలు నాయకులను గుడ్డిగా నమ్మారు. వారు ప్రజలను ఇలా ముంచారు!!! అచ్చం ఆంధ్రప్రదేశ్ విభజన లాగే!!!
రవీంద్ర గారు, సేకరణ.....
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి