ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బ్యాంకు ఖాతాల‌ను అలా వ‌దిలేస్తున్నారా?..

బ్యాంకు ఖాతాల‌ను అలా వ‌దిలేస్తున్నారా?  

రెండేళ్ల‌పాటు ఎలాంటి లావాదేవీలు జ‌ర‌గ‌ని ఖాతాల‌ను ప‌నిచేయ‌ని ఖాతాలుగా గుర్తిస్తారు

చాలామంది త‌మ ఆర్థిక విష‌యాల‌ను ఎవ‌రితో పంచుకోవ‌డానికి ఇష్ట‌పడ‌రు. దీంతో వారికి అనుకోకుండా ఏమైనా జ‌రిగినా, బ్యాంకు ఖాతాల్లో డ‌బ్బు ఉంద‌న్న సంగ‌తి క‌టుంబ స‌భ్యుల‌కు కూడా తెలియ‌దు. మ‌రోవైపు, వేరే ప్రాంతాల‌కు వెళ్లిన‌ప్పుడు పాత బ్యాంకు ఖాతాల‌ను ప‌ట్టించుకోకుండా వ‌దిలేస్తారు. ఇలా మార్చి 31, 2019 వ‌ర‌కు క్లెయిమ్ చేసుకోని బ్యాంకు డిపాజిట్ల నుంచి రూ.25,000 కోట్లు ఆర్‌బీఐ ప్రారంభించిన డిపాజిట‌ర్స్ ఎడ్యుకేష‌న్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏఎఫ్‌) ఫండ్‌లో జ‌మ‌య్యాయి. ఇలాంటి క్లెయిమ్ చేయ‌ని బ్యాంకు డిపాజిట్ల న‌గ‌దును ఈ ఖాతాలో చేరుస్తారు. దీనిని 2014 లో ఆర్‌బీఐ ప్రారంభించింది.

ఈ ఫండ్‌లో చేరిన మొత్తాన్ని ప్ర‌భుత్వ సెక్యూరిటీలలో ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన క‌మిటీ పెట్టుబ‌డి చేస్తుంది. దానిపై వ‌చ్చిన ఆదాయాన్ని డిపాజిట్ల‌కు వ‌డ్డీ చెల్లించేందుకు, పెట్టుబ‌డుల అవ‌గాహ‌న‌, విద్య కోసం ఉప‌యోగిస్తారు. డీఈఏఎఫ్ ఖాతాలో న‌గ‌దు పెరిగేందుకు కార‌ణం క్లెయిమ్ చేసుకొని ఖాతాల డిపాజిట్లు, రాబ‌డి నుంచి వ‌చ్చినదే.

ఆర్‌బీఐ ఎప్ప‌టిక‌ప్పుడు ఈ డిపాజిట్ల‌పై వ‌డ్డీ చెల్లిస్తుంటుంది. ఖాతాదారులు లేదా వార‌సులు ఈ ఖాతాల‌ను ఎప్పుడైన అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు చూపి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే బ్యాంకులు ఇటువంటి క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని నిపుణులు భావిస్తున్నారు.

క్లెయిమ్ చేయ‌ని డ‌బ్బు

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, బ్యాంకు ఖాతాను ప‌దేళ్ల‌కు మించి ఆప‌రేట్ చేయ‌క‌పోతే అందులో ఉన్న డ‌బ్బు డీఈఏఎఫ్ ఖాతాకు చేరుతుంది. రెండేళ్ల వ‌ర‌కు ఆప‌రేట్ చేయ‌ని ఖాతాను ( వ‌డ్డీ, క‌నీస ఛార్జీలు) ప‌నిచేయ‌ని ఖాతాగా ప‌రిగ‌ణిస్తారు. ఇలాంటి వాటిలోకి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రిక‌రింగ్ డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంకు చెక్కులు, పే ఆర్డ‌ర్లు, ప‌రిష్కారం కాని నెఫ్ట్ లావాదేవీలు కూడా వ‌స్తాయి. బ్యాంకు ఈ-మెయిల్ లేదా ఫోన్ ద్వారా వినియోగ‌దారునికి దీని గురించి స‌మాచారం అందిచాల్సి ఉంటుంది. కానీ, బ్యాంకులు వినియోగ‌దారులకు ఈ విష‌యాన్ని తెలియ‌జేయ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు వినియోగ‌దారులు వారి వివ‌రాల‌ను, మొబైల్ నంబ‌ర్‌ను అప్‌డేట్ చేయ‌క‌పోవ‌డం కూడా కార‌ణంగా చెప్తున్నారు.

ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, ప్రతి బ్యాంకు క్లెయిమ్ చేయని ఖాతాల వివరాలను బ్యాంక్ వెబ్‌సైట్‌లో చూపించాల్సిన అవసరం ఉంది. వెబ్‌సైట్‌లోని వివరాలను ప‌రిశీలించిన‌ తరువాత, ఖాతాదారులు సరిగ్గా నింపిన క్లెయిమ్ ఫారమ్, డిపాజిట్ల రశీదులు, కేవైసీ ప‌త్రాల‌తో బ్యాంక్ శాఖను సంప్ర‌దించి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే ఇంత‌కుముందు ఖాతా ఉన్న బ్యాంకుకే వెళ్లి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉండేది. కానీ, ఇప్పుడు బ్యాంకు ఏ శాఖ‌కు వెళ్లినా క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంది. అయితే బ్యాంకు ఖాతా చాలా పాత‌ది అయితే దానికి మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ స‌దుపాయాలు లేక‌పోతే హోమ్ బ్రాంచ్‌కు వెళ్ల‌డ‌మే మంచిది. ఖాతాదారుడి వార‌సులు లేదా నామినీలు డిపాజిట్ల ర‌శీదులు, ఖాతాదారుడి మ‌ర‌ణ దృవీక‌ర‌ణ ప‌త్రం, మీకు సంబంధించిన గుర్తింపు ప‌త్రాల‌ను తీసుకెళ్లాలి. అన్నీ ప‌రిశీలించిన త‌ర్వాత బ్యాంకు ఖాతాలోని డ‌బ్బును అప్ప‌గిస్తుంది.

బ్యాంక్ వినియోగ‌దారుల‌కు చెల్లింపు చేసిన తరువాత, అది డీఈఏఎఫ్ ఖాతా నుంచి రీఫండ్ పొందడానికి నెల చివరిలో ఆర్‌బీఐకి క్లెయిమ్ చేస్తుంది. వినియోగ‌దారుడు క్లెయిమ్ చేసుకున్న త‌ర్వాత ఖాతా ఆప‌రేటివ్‌గా మారుతుంది. ఒకవేళ చట్టబద్ధమైన వారసుడు లేదా నామినీ క్లెయిమ్ కోరిన‌ట్ల‌యితే, బ్యాంక్ ఖాతా పరిష్కార ప్రక్రియను ప్రారంభిస్తుంది, దీనికి ఎటువంటి ఛార్జీలు వ‌ర్తించ‌వు.

చివ‌ర‌గా

మీ పెట్టుబ‌డుల నిర్వ‌హ‌ణ స‌క్ర‌మంగా ఉండాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. క్లెయిమ్ చేయ‌ని డిపాజిట్లు పెరిగేందుకు ముఖ్య‌ కార‌ణం, ఖాతాదారులు వారి కుటుంబ స‌భ్యుల‌కు, ద‌గ్గ‌రివారికి కూడా పెట్టుబ‌డులు, డిపాజిట్ల గురించి చెప్ప‌క‌పోవ‌డ‌మే అని స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. పెట్టుబ‌డుల వివ‌రాల‌కు సంబంధించిన‌ అన్ని రికార్డుల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవాలి. క‌నీసం ఇద్ద‌రికైనా పెట్టుబ‌డుల విష‌యాన్ని తెలియ‌జేయాలి. ఒక‌రు కుటుంబ స‌భ్యులు మ‌రొక‌రు మీకు విశ్వాసం ఉన్న‌వారు కూడా ఉండొచ్చు. మీరు లేక‌పోయినా మీకు సంబంధించిన వారికి డ‌బ్బు చేరేలా ఉండాలి.

డ‌బ్బు సంపాదించేందుకు చాలా శ్ర‌మిస్తారు. మ‌రి క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు ఎవ‌రికి చెంద‌కుండా ఉంటే ఏం లాభం? మీరు ఎవ‌రికోసం కూడ‌బెట్టారో వారికి చేరేలా ప్ర‌ణాళిక‌లు ఉండాల‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి