ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

 

ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి.

చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు.

హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు.

నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను.

“వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో.

అలాగే మాఅమ్మ కూడా.

ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను.

నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం.

ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ వచ్చింది. రేణుక, తనతోపాటు నన్నూ సీతారామమ్మనీ కూడా రమ్మంది ఊరు చూసొద్దాం అని. సరే అని ముగ్గురం కలిసి వెళ్లేం.

విజయనగరం విశాఖపట్నానికి అట్టే దూరం లేదు. బస్సులో గంట ప్రయాణం. నేను మామూలుగా శనాదివారాలు ఇంటికి వచ్చేదాన్ని.

అలాగే ఆవారం కూడా భువనేశ్వరంనించి తిరిగి వచ్చేక విశాఖపట్నం వచ్చేను. మా అమ్మ హాల్లో ఎవరితోనో మాట్లాడుతోంది.. .

ఆవిడ, “ఆడపిల్ల. పెళ్ళి కావలసినపిల్ల. ఎందుకలా ఊళ్ళు తిరుగుతూ డబ్బు వృథా చేయ్యనిస్తారు? దాచుకోమని చెప్పండి కట్నానికి పనికొస్తుంది,” అన్నారు.

నేను పక్కగదిలోంచి వింటున్నాను.

మా అమ్మ, “వెళ్లి దేశం చూడు అని చెప్పి ఇవ్వడానికి నాదగ్గిర డబ్బు ఎప్పుడూ లేదు. ఇప్పుడు అది సంపాదించుకుని ఆ డబ్బుతో ఊళ్ళు తిరిగితే నేనెందుకు కాదనాలి,” అనడం విన్నాను.

అలాగని అమ్మా నాన్నగారూ నాగురించి అస్సలు పట్టించుకోకుండా, నన్ను గాలికి వదిలేసారని కాదు. అవసరమైనచోట ఆదుకుంటూనే వచ్చేరు.

ను యూనివర్సిటీలో లైబ్రరీసైన్సు చదువుతున్నరోజులలో మాప్రొఫెసరు నన్ను అమెరికాకి వెళ్లమని ప్రోత్సహించేవారు. ఆయనే పని గట్టుకుని అప్లికేషను ఫారం కూడా తెప్పించి ఇచ్చేరు.

కానీ నాకు అమెరికా అంటే సరదా లేదు. ముఖ్యం అందరూ ఆరోజుల్లో అమెరికా అమెరికా అని వేలంవెర్రిగా తహతహలాడేవారు. అది సగం కారణం. అందరూ చేసిపని నేను చేయను, చేయలేదు అప్పుడూ ఇప్పుడూ కూడా .ఊరందరిదీ ఒకదారి ఉలిపికట్టెది ఒకదారి అని సామెత.

నాకు అమెరికా వెళ్లడం ఇష్టంలేదని ప్రొఫసరుగారికి చెప్పలేదు కానీ ఆ ఫారం మాత్రం నింపలేదు. ఇంటికి తెచ్చి బల్లమీద పడేసేను.

తరవాత నాన్నగారు చూసి, సంగతి తెలుసుకుని, ఆయనే ఆ ఫారం నింపి నాకిచ్చి పంపించేరు.

ఏదో నామమాత్రంగా ఓ వందడాలర్లు ఇస్తాం అన్నారు. అది చాలదు కనక ఆ ప్రయత్నాలు అక్కడితో ఆగిపోయేయి.

చాలాకాలంతరవాత ఒకసారి పెద్దన్నయ్య నన్ను వెక్కిరించేడు నాకు నేను ఆలోచించుకోడం నాకు చేతకాదని. పైన చెప్పిన అప్లికేషను ఫారం కథ ఉదహరణగా చూపించేడు.

నేను తిరపతిలో ఉద్యోగంలో చేరినప్పుడు అమ్మ వచ్చి, ఇల్లు చూసి పెట్టి, వంటమనిషిని, పనిమనిషిని మాట్లాడిపెట్టింది. లైభ్రరీకి వెళ్ళడానికి రిక్షా కూడా కుదిర్చిపెట్టింది. చాకలిని కూడా ఏర్పాటు చేసింది. లైబ్రరీ ప్యూను ఒకతను కూరలు తెచ్చిపెట్టేవాడు. అలాగే మరో ఇద్దరు నాకు బియ్యం, కిరసనాయిలులాటివి దొరక్కపోతే ఎక్కణ్ణుంచో పుట్టించి తెచ్చిఇచ్చేవారు.

నేను తిరపతిలో ఉన్న తొమ్మిదేళ్లూ నాకు నిజంగా రాజభోగంగా జరిగింది. లైబ్రరీలోనూ, ఊళ్లోనూ కూడా నన్ను ఎంతో గౌరవంగా చూసేరు అందరూను.

ఒక్కమాటలో చెప్పాలంటే, చిన్నప్పట్నుంచీ నామీద నేను ఆధారపడడం, నా నిర్ణయాలు నేనే చేసుకోడం నేర్పేరు అమ్మా, నాన్నగారు కూడా నాకు. అలాగే అవసరమైనచోట అండగా నిలిచేరు కూడా

Credits: గన్నవరపు చంద్రమౌళి (బొబ్బిలి) Telegram: @Swaralahari

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి