తృప్తితో కూడిన సామాన్య జీవితం ఎంతో ఉత్తమం
ఎవరైతే దుర్బుద్ధి, అక్రమ సంబంధం (స్త్రీ వ్యామోహం), అసత్యం, అవినీతి (ధనాశ), అధర్మం, అన్యాయం, మోసం, జూదం, మద్యపానం, ద్వేషం (క్రోధం - హింస) కలిగియుంటారో వారిని పాపకూపంలోకి లాగుతాడు కలిపురుషుడు.
వారిని చూస్తే భోగములతో వైభవంగా ఉన్నట్లనిపిస్తుంది. ఇది సరిగా అర్థంచేసుకోలేక, సామాన్యులు కొంతమంది "మనకి మాత్రమే ఈ పేదరిక బాధలు, కష్టాలు ఎందుకు? " అని చాలా మంది భగవంతుడిని దూషిస్తూ ఉంటారు.
నిజానికి భగవంతుడు పరీక్షించేది వీరిని కాదు, పైన చెప్పిన వారిని.
కలి ప్రభావానికి లోనైనవారు మాత్రం తమ భోగాలు చూసి మురిసిపోతుంటారు కాని ఇది ముందు ముందు జన్మలకి ఎంత ప్రమాదమో గ్రహించలేరు.
తద్విరుద్ధంగా, నిత్యం భగవన్నామ స్మరణ, సత్యం, ధర్మాచరణతో, పరోపకారంతో సరళమైన జీవితం గడిపేవారికి ప్రశాంతమైన జీవితంతో పాటు, ముందు ముందు ఉత్తమ జన్మ లభిస్తుంది.
ఈ సూత్రం ఎవరికైనా, ఎంతటి వారికైనా, ఆధ్యాత్మిక వ్యాపారం చేసే వారికైనా ఒక్కటే.
ఎక్కడి నుండి వచ్చామో, ఏ రూపాంతరం చెందామో ఎవరికీ తెలియదు.
ఒక్కటి మాత్రం సత్యంగా కంటిముందే సాక్ష్యం.
ఎన్నో జీవరాసులు, చీమలు, వానపాములు, కుక్కలు, పాములు, పులి, పంది, పక్షులు, పురుగులు మరెన్నో లక్షల జీవులు. వాటికి ఆ జీవితం, మనది మనుష్య జన్మ. ఎలా ? ఇదే అలోచిస్తే జ్ఞానం. నిర్లక్ష్యిస్తే అజ్ఞానం.
కనుక, మెరిసేదంతా బంగారం కాదు. ఆ భోగాలకి తాపత్రయపడి ఆర్భాటాలకి, కట్టడాలకి, దైవం ముసుగులో లౌకికులకి లొంగి అసూయలో పడి నీచజన్మకి లోనుకాకూడదు.
ఆధునిక ఆధ్యాత్మికం అత్యంత ప్రమాదకరం, మహాపాపం.
గరుడపురాణం చదవండి. మన జీవిత లక్ష్యాన్ని, ఫలితాలను తెలియచేస్తుంది.
తృప్తితో కూడిన సామాన్య జీవితం ఎంతో ఉత్తమం.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి