ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మనుషుల్లో మనీషి...

 మనుషుల్లో మనీషి....!!

నేను రోజూ మార్నింగ్ వాక్ కి వెళ్తూ అనేకమందిని గమనిస్తూ ఉంటాను...

ఒక 65...70 ఏళ్ల మధ్య వయసున్న ఒకాయన రోజూ తెల్లటి ప్యాంటు తెల్లటి షర్టు వేసుకుని చేతిలో ఒక గుడ్డ సంచీ తో కొంచెం కష్టం గానే నడుస్తూ కనపడతారు...భారీకాయమే...!!


ఆయనే నడవలేనపుడు చేత్తో రోజూ ఆ బరువైన సంచీ ఎందుకో అనిపించేది....


ఒక సారి నేను లేట్ గా వెళ్ళినప్పుడు చూసాను..ఆయన ఖాళీ సంచీని మడతపెట్టి చంకలో పెట్టుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు....


సరే ఒకసారి పొద్దున్నే ఆయన వెనకే వెళ్ళాల్సి వచ్చింది..సరే ఆయన ఏమి చేస్తారో చూద్దామని డిసైడ్ అయిపోయి ఫాలో అయ్యాను....


మాకు పార్కులో ఒక lake వస్తుంది మొదట...అందులో చేపలు విపరీతంగా ఉంటాయి...బాతులు కూడా...
ఆయన తన బరువైన సంచీలోంచి ఒక పాకెట్ తీసి అందులో బ్రెడ్ తీసి చిన్న చిన్న ముక్కలు చేసి lake.లో వేశారు...పెద్ద పెద్ద ముక్కలు చేసి గట్టుమీద ఉన్న కుక్కలకు వేశారు...అలాగే biscuits కూడా...


ఇంకొంచెం దూరం నడిచి పెద్ద పెద్ద చెట్ల దగ్గర ఆగి సంచీ లోంచి ఇంకో పొట్లం తీసి అందులోంచి గుప్పెళ్లతో బియ్యపు పిండి తీసి చెట్ల చుట్టూరా... తొర్రల్లో చల్లాడు...
తర్వాత చీమల పుట్టల దగ్గర ఆగి బియ్యపు రవ్వ చల్లాడు....
గుంపుల గుంపులు గా ఉన్న పావురాళ్ళకి జొన్నలు తీసి జల్లాడు....
తరువాత ఉడతలు ఎక్కువగా తిరిగే ప్లేసులో వేరుశెనగ గింజలు జల్లాడు....
అలాగే చిలకల కోసం అక్కడ ఎత్తైన ప్రదేశం లో కూడా nuts ఏవో వేసాడు....


ప్రతీ చెట్టు మొదట్లో పిండి..రవ్వలు జల్లుకుంటూ పార్క్ అంతా ఆయాస పడుతూ తిరిగి సంచీ ఖాళీ చేసుకుని వెళ్లిపోతున్నారు...


నాకు అర్ధమయ్యింది ఏంటంటే ఆయన నడక కోసం రావట్లేదు....కేవలం క్రిమి కీటకాదులకి...పశు పక్ష్యాదులకి ఆహారం ఇవ్వడానికి మాత్రమే వస్తున్నారు....
అదే ఆయన ధ్యేయం....
నేను నిజంగా ఇలాంటి మనుషులుంటారా అని ఆశ్చర్య పోయాను...తెలియని అనుభూతికి గురి అయ్యాను...
ఇదే రొటీన్ ఆయనది 365 రోజులూ....
ఒకరోజు అక్కడ ఒక ఆమె అడుక్కుంటుంటే ఆయన సంచీలోంచి ఒక బన్ తీసి ఆమెకి ఇచ్చి ముందుకు పోయారు...
నేను చూస్తూనే ఉన్నాను ఆమె అతను వెళ్లిపోగానే ఆ బన్ ని చెట్లలోకి విసిరి కొట్టింది...
పాపం ఆయన కి ఇదేమీ తెలియదు...తనపనిలో తను వెళ్ళిపోయాడు...
నేను ఆ బిచ్చగత్తెను అడిగాను...ఎందుకు అలా పారేశావు... తప్పుకదా...అని...
దానికి ఆమె నాకు అది ఇష్టం ఉండదు అంది...
నాకు చాలా కోపం వచ్చి... ఇష్టం లేకపోతే తీసుకోకమ్మా...ఒకవేళ తీసుకున్నా అలా పడేయకూడదు తినే పదార్థాలు.. కుక్కలకు పెట్టు...నీలాంటి వాళ్ళకి ఇవ్వు..అని చివాట్లు వేసాను...
అప్పటికే ఆయన చాలా దూరం వెళ్లిపోయారు అన్ని జీవాలకీ ఆహారం అందిస్తూ...నేను పరుగున వెళ్లి ఆయన్ని
అందుకుని...
Sir మీ ఫోటో తీసుకోవచ్చా అని అడిగాను...


ఎందుకమ్మా అని ఆశ్చర్యంగా అడిగారు...ఆయన తెలుగు ఆయన కాదు ...హిందీ మాతృభాష...
నేను నాకు వచ్చీ రాని హిందీలో నా భావాన్ని ఆయనకి కమ్యూనికేట్ చేయగలిగాను...


" మీ సేవ నేను రోజూ చూస్తున్నాను సర్...మీరు ఒక అద్భుతం..." అని అంటుండగానే...
ఆయన అన్నారు...అమ్మా ఇది నా గొప్పతనం కాదు...దేవుడు నాచేత ఇలా చేయిస్తున్నాడు... సంకల్పం ఆయనది...


నా కన్నా ఎక్కువగా దాన ధర్మాలు చేసే వాళ్ళున్నారు లోకంలో...ఎందరో మహానుభావులు ఉన్నారు...
మా నాన్నగారు చెప్పేరమ్మా...నీ సంపాదనలో 60% నువ్వు ఖర్చు పెట్టుకో...మిగిలిన 40% దానం చెయ్యి అని....అదే నేను follow అవుతాను...


నేను మా నాన్నగారిని అడిగాను...ఒకవేళ నాదగ్గర రెండు బ్రెడ్ slices ఉండి... నేను నా బిడ్డా తినాల్సి వస్తే ఏమి చెయ్యాలి అని...
ఆయన అన్నారు...అందులో 60%తిని మిగిలింది ఎవరికైనా పెట్టు అని...
నేను అదే ఫాలో అవుతున్నాను....ఈ బుల్లి బుల్లి చీమలకి...పురుగులకి...మిగిలిన జీవులకి ఆహారం ఎలా అమ్మా...వాటికి దేవుడు నా ద్వారా అందిస్తున్నాడు...నేను నిమిత్తమాత్రుడిని
అని చెప్పి ముందుకు వెళ్లిపోయారు తన పనిలో గబగబా....


మన మధ్య గుర్తింపు లేకుండా ఎంతో మంచిపనులు చేసే గొప్ప వ్యక్తులు ఎంత నిరాడంబరంగా జీవించేస్తున్నారో కదా...
వాళ్ళు ఏదీ ఆశించడం లేదు...
5 రూపాయలు దానం చేసి 100 మందికి చెప్పే వాళ్ళున్నారు...
దానం చేస్తూ ఫోటోలు తీయించుకుని publicity చేయించుకునే వాళ్ళున్నారు...
రోడ్ మీద అర్ధరాత్రి ఒక van లో దుప్పట్లు వేసుకుని road సైడ్ పడుకున్న వాళ్ళమీద దుప్పట్లు కప్పుకుంటూ calm గా వెళ్లిపోయేవాళ్ళున్నారు...


ఒకాయన వేడి వేడి గా pongal వండించి పెద్ద can లో పెట్టుకుని park బయట గేటు దగ్గర కూర్చుని అక్కడ
ఉన్న బీదా బిక్కీ అందరికి ఆకులో పొంగల్ వడ్డించి పచ్చడి వేసి ఇవ్వడం కూడా నేను చూసాను...
సాటి మనుషులకు సేవ ఒక ఎత్తు...


కానీ ఈ మూగ జీవాలకి ఆహారం అందించడం ఒక ఎత్తు...
నేను ఆయనతో మాట్లాడటం ఒక మరిచిపోలేని అనుభవం....
ఇలాంటి వాళ్ళకి నమస్కరించడం తప్ప ఏమి చేయగలం...??
ఆయన తో ఫోటో నాకు ఒక పెద్ద సెలెబ్రిటీ తో ఫోటో తీయించుకున్నంత విలువైనది...


ఒక మిత్రుడు పంపించింది మీకు పంపుతున్నాను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి