ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బ్లడ్ గ్రూపులను కనిపెట్టి మానవాళికి ఎంతో మేలుచేసిన శాస్త్రవేత్త - కార్ల్ లాండ్ స్టీనర్

మానవ రక్తంలో ప్రధానంగా ఉండే A B, O అనే మూడు ప్రధాన గ్రూపులను గుర్తించి వైద్యశాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించిన శాస్త్రవేత్తగా కార్ల్ లాండ్ స్టీనర్ సుప్రసిద్ధుడు. ఆస్ట్రియాలోని వియన్నాలో 1868 జూన్ 14న జన్మించారు కార్ల్. ఇవాళ రక్త మార్పిడి ద్వారా ఎన్నో ప్రాణాలు నిలుస్తున్నాయంటే అది ఆయన చలవే. అందుకే 1930లో వైద్యశాస్త్రంలో ఆయన నోబెల్ పురస్కారాన్ని పొందారు. ఈయనది O గ్రూప్



1891లో వియన్నా యూనివర్సిటీ నుంచి ఎం.డి. పట్టా పొందిన ఆయన ఐరోపాలో పలువురు పేరుపొందిన శాస్త్రవేత్తల దగ్గర ఆర్గానిక్ కెమిస్ట్రీని అధ్యయనం చేశారు. తిరిగి వియన్నా యూనివర్సిటీకి వచ్చి తనకెంతో ఇష్టమైన ఇమ్యునాలజీ రంగంలో పరిశోధనలు చేసి, 1901లో మానవ AB O బ్లడ్ గ్రూప్ వ్యవస్థ గురించి ప్రచురించారు. ఆ కాలానికే ఇద్దరు వ్యక్తుల రక్తాన్ని మిశ్రమం చేస్తే రియాక్షన్ వస్తుందనే విషయం తెలిసినా, దానికి కారణమేంటనే విషయం తెలీదు. భిన్న వ్యక్తులకు చెందిన రక్తం కలిసినప్పుడు ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే కొన్ని యాంటీజెన్స్ వల్ల రియాక్షన్స్ వస్తాయని వెల్లడించిన కార్ల్, ఆ యాంటీజెన్ను A, B, C (తర్వాత దీన్ని O గా మార్చారు)గా గుర్తించారు. ఆ తర్వాతి ఏడాదే మరో బ్లడ్ గ్రూపును గుర్తించారు. అదే AB,  A బ్లడ్ గ్రూప్ వ్యక్తికి B బ్లడ్ ను ఎక్కిస్తే, అతని నిరోధక వ్యవస్థ B యాంటీజెన్ను గుర్తించదనీ, ఫలితంగా అవి ఇన్ఫెక్షన్కు గురిచేసి, ప్రమాదకరంగా పరిణమిస్తాయనీ కార్ల్ కనిపెట్టారు. దాంతో ఒక బ్లడ్ గ్రూప్ కు చెందిన వ్యక్తికి అదే గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తేనే ప్రయోజనం ఉంటుందని ఆయన తేల్చారు. 

అప్పట్నుంచే రక్త మార్పిడి ప్రక్రియ మొదలై వైద్యశాస్త్ర రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేసింది. మానవ బ్లడ్ గ్రూప్లపై అధ్యయనంతో సరిపెట్టలేదు కార్ల్. సైన్సు ఇతరత్రా కూడా కీలక సేవలందించారు. రుమేనియా శాస్త్రవేత్త కాన్స్టాంటిన్ లెవడిటితో కలిసి పోలియో వ్యాధికి కారణమైన సూక్ష్మజీవిని ఆయన కనిపెట్టారు. అలా పోలియో వాక్సిన్ వృద్ధికి ఆయన పునాది వేశారు. అంతేనా ! సిఫిలిస్ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవుల్ని గుర్తించడంలోనూ ఆయన తోడ్పాటునందించారు. తన పరిశోధనల సారాంశాన్ని ఆయన 'ద స్పెసిఫిసిటీ ఆఫ్ సెరొలాజికల్ రియాక్షన్స్' (1986) పేరుతో ప్రచురించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 1943 జూన్ 26న ఆయన మృతి చెందారు.

Credits: శర్మ గారు, మనం పత్రిక సౌజన్యంతో...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి