ఆడపిల్ల అంటే గడపదాటనీయనిరోజులవి. అందులో ఒకదేవదాసి కుటుంబంలో పుడితే ఇక పరిస్థితులు ఎలావుంటాయో ఊహించవచ్చు. అలా దేవదాసీ కుటుంబంలో 30 జూలై 1886 లో పుట్టింది ఆ అమ్మాయి. దేవదాసీగా తన అమ్మ అనుభవిస్తున్న బాధలను కళ్ళారా చూస్తూ పెరిగింది. అందుకే దేవదాసీవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని చిన్నతనంలోనే అనుకుంది...
తను చదువుకుంటానంటే అమ్మ ఒప్పుకోలేదు.కానీ తండ్రి నారాయణస్వామి కూతురును ప్రోత్సహించి పాఠశాలలో చేర్చాడు.మొట్టమొదట "BOYS" స్కూల్ లో జాయిన్ అయిన మొదటి బాలిక ఆమే. 13 సంవత్సరాలకే అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో పదవతరగతిలో ఉత్తీర్ణత సాధించింది..1912లో మద్రాసు మెడికల్ కాలేజ్ నుండి పట్టాపొంది ..కొన్ని నెలలు హౌస్ సర్జన్ గా చేసింది.భారత్ లో "మొదటి మహిళా హౌస్ సర్జన్" ఈమె. ఉన్నత విద్యకై ఇంగ్లండ్ వెళ్ళివచ్చింది. శేఖర్ రెడ్డి అనే డాక్టర్ ను వివాహం చేసుకోవడంతో అప్పటి వరకు "ముత్తులక్ష్మి"గా వున్న ఆమె ముత్తులక్ష్మీరెడ్డిగా పేరుగాంచింది.
సరోజీనాయుడిగారితో కలిసి అనేక మహిళా ఉద్యమాలలో పాల్గొన్నది.. పేద బాలికలకు,వృద్ధ మహిళలకు "అవ్వైహోం" అనే అనాధశరణాలయంను స్థాపించింది. బాలికల కోసం పాఠశాలలను స్థాపించింది. ముఖ్యంగా దేవదాసీల పిల్లలకోసం స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది.ఆమె సేవలను గుర్తించిన అప్పటి భారతప్రభుత్వం ఆమెను1927 లో శాసనమండలికి నామినేట్ చేసింది. భారతదేశంలో తొలిమహిళా యం.యల్ .ఏ. గా గుర్తింపుపొందింది. 1931 లో స్త్రీధర్మ అనే పేరుతో ఒక మహిళా సంస్థను నెలకొల్పారు. తన చెల్లికి క్యాన్సర్ సోకినప్పుడు బ్రిటన్ లో తనే దగ్గరుండి సేవలుచేసి బతకించుకుంది. కేన్సర్ వల్ల పేదలెవరూ బాధపకూడదని 1954 లో అడియార్ దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించించారు. ఇదే ప్రఖ్యాత "అడియార్ క్యాన్సర్ హాస్పటల్ "....
"A lady of many first" గా పేరుగాంచిన ముత్తులక్ష్మీరెడ్డిగారు స్త్రీలహక్కులకోసం,వారి మీద జరిగే సాంఘికదురాచారాలపై అలుపెరగని పోరాటంచేసారు. సరోజీనీదేవి,దుర్గాబాయ్ దేశముఖ్ ,అనిబీసెంట్ వంటి మహిళా ఉద్దండులతో కలిసి పనిచేసారు. 1956లో భారతప్రభుత్వం "పద్మవిభూషణ్ "తో సత్కరించింది.ఆమె 133 జయంతిని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం ఈరోజును "హాస్పిటల్ డే" గా జరుపాలని అధికారికంగా ప్రకటించింది. తమిళ రాష్ట్రంలో ఒక తెలుగుమహిళకు లభించిన అరుదైన గౌరవం ఇది!!!
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి