ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మొదటి మహిళా హౌస్ సర్జన్ - A lady of many first - ముత్తులక్ష్మీరెడ్డి

ఆడపిల్ల అంటే గడపదాటనీయనిరోజులవి. అందులో ఒకదేవదాసి కుటుంబంలో పుడితే ఇక పరిస్థితులు ఎలావుంటాయో ఊహించవచ్చు. అలా దేవదాసీ కుటుంబంలో 30 జూలై 1886 లో పుట్టింది ఆ అమ్మాయి. దేవదాసీగా తన అమ్మ అనుభవిస్తున్న బాధలను కళ్ళారా చూస్తూ పెరిగింది. అందుకే దేవదాసీవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని చిన్నతనంలోనే అనుకుంది... 



     తను చదువుకుంటానంటే అమ్మ ఒప్పుకోలేదు.కానీ తండ్రి నారాయణస్వామి కూతురును ప్రోత్సహించి పాఠశాలలో చేర్చాడు.మొట్టమొదట "BOYS" స్కూల్ లో జాయిన్ అయిన మొదటి బాలిక ఆమే. 13 సంవత్సరాలకే అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో పదవతరగతిలో ఉత్తీర్ణత సాధించింది..1912లో మద్రాసు మెడికల్ కాలేజ్ నుండి పట్టాపొంది ..కొన్ని నెలలు హౌస్ సర్జన్ గా చేసింది.భారత్ లో "మొదటి మహిళా హౌస్ సర్జన్" ఈమె. ఉన్నత విద్యకై ఇంగ్లండ్ వెళ్ళివచ్చింది. శేఖర్ రెడ్డి అనే డాక్టర్ ను వివాహం చేసుకోవడంతో అప్పటి వరకు "ముత్తులక్ష్మి"గా వున్న ఆమె ముత్తులక్ష్మీరెడ్డిగా పేరుగాంచింది.

      సరోజీనాయుడిగారితో కలిసి అనేక మహిళా ఉద్యమాలలో పాల్గొన్నది.. పేద బాలికలకు,వృద్ధ మహిళలకు "అవ్వైహోం" అనే అనాధశరణాలయంను స్థాపించింది. బాలికల కోసం పాఠశాలలను స్థాపించింది. ముఖ్యంగా దేవదాసీల పిల్లలకోసం స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది.ఆమె సేవలను గుర్తించిన అప్పటి భారతప్రభుత్వం ఆమెను1927 లో శాసనమండలికి నామినేట్ చేసింది. భారతదేశంలో తొలిమహిళా యం.యల్ .ఏ. గా గుర్తింపుపొందింది. 1931 లో స్త్రీధర్మ అనే పేరుతో ఒక మహిళా సంస్థను నెలకొల్పారు. తన చెల్లికి క్యాన్సర్ సోకినప్పుడు బ్రిటన్ లో తనే దగ్గరుండి సేవలుచేసి బతకించుకుంది. కేన్సర్ వల్ల పేదలెవరూ  బాధపకూడదని 1954 లో అడియార్ దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించించారు. ఇదే ప్రఖ్యాత  "అడియార్ క్యాన్సర్ హాస్పటల్ "....

       "A lady of many first" గా పేరుగాంచిన ముత్తులక్ష్మీరెడ్డిగారు స్త్రీలహక్కులకోసం,వారి మీద జరిగే సాంఘికదురాచారాలపై అలుపెరగని పోరాటంచేసారు. సరోజీనీదేవి,దుర్గాబాయ్ దేశముఖ్ ,అనిబీసెంట్ వంటి మహిళా ఉద్దండులతో కలిసి పనిచేసారు. 1956లో భారతప్రభుత్వం "పద్మవిభూషణ్ "తో సత్కరించింది.ఆమె 133 జయంతిని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం ఈరోజును "హాస్పిటల్ డే" గా జరుపాలని అధికారికంగా ప్రకటించింది. తమిళ రాష్ట్రంలో ఒక తెలుగుమహిళకు లభించిన అరుదైన గౌరవం ఇది!!!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి