ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలివి ఎవడబ్బ సొత్తు?_

 

చదువుకొన్న " వాడు మాత్రమే మేధావా? 'చదువుకొనని ' వాడు మేధావి కాదా?

దీనికి మీకు ఒక మంచి ఉదాహరణను అందిస్తాను, చదవండి. ఒక వ్యక్తి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, కృషి, పట్టుదలతో కష్టపడి బాగా డబ్బు సంపాదించి, జీవితంలో బాగా సెటిల్ అయ్యాడు. అతను ఒకసారి అర్జెంటు పని బడి సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఒక టైర్ పంచర్ అయ్యింది. టైర్ మార్చడానికి డ్రైవర్ లేడు. అటు పక్కగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు. ఇక తప్పని పరిస్థితిలో తానే ఎలాగోలా స్టెప్ని టైర్ మార్చడానికి తనే స్వయంగా  సిద్ధమయ్యాడు.


డిక్కీ లోని టూల్స్, స్టెప్నీ టైర్ బయటకు తీసి, ఎంతో కష్టపడి వీల్ నట్లన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారీ టయర్ నట్ల పైపడి అవన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాయి. సూటు బూటు లో ఉన్న తాను వాటిని తీయలేడు, మరి ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుండగా అటు పక్కగా ఒక వ్యక్తి అక్కడక్కడా చినిగి పోయిన, మురికి బట్టలు వేసుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు. అతడు ఈయన్ని చూసి సార్ మీరు ఎవరు, మీ కారుకు ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ ఇంజనీర్ తాను ఎవరో తన హోదా ఏమిటో వివరాలు చెప్పి, టైర్ మార్చబోయే సమయంలో జరిగిన విషయం అంతా చెప్పి నీవు ఆ కాలువలోకి దిగి ఆ కాలువలో నుండి అందులో పడిపోయిన నట్లను వెతికి బయటకు తీసిస్తే మీకు ఎంత డబ్బైనా ఇస్తానని అన్నాడు. 


  అప్పుడు ఆ వ్యక్తి చూడండి సార్, కాలువలో దిగి నట్లను వెదికి బయటకు తీయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ అంతకంటే సులభమైన మార్గం ఒకటి మీకు చెబుతాను. అలా చేస్తే ఎవరూ మురికి కాలువలో దిగవలసిన అవసరం ఉండదు. అదేమంటే మీ కారుకున్న మిగతా మూడు వీల్స్ ల నుండి ఒక్కోక్క నట్టును తీసి ఈ వీల్ కు వేయండి. దానివల్ల కారును మీరు ఏ ఇబ్బందీ లేకుండా నడిపించవచ్చు.


 తరువాత మీరు వెళ్ళే దారిలో వచ్చే మెకానిక్ షాప్ లో మిగతా నాలుగు నట్లు కొని, వాటిని అన్ని వీల్స్ కు వేసుకుంటే సరిపోతుంది కదా. దానికోసం నేను మురికి కాలువలో దిగి మురికి, బురద అంటించుకోవడం, మీరు నాకు అడిగినంత డబ్బు ఇవ్వడం, ఇవన్నీ అవసరం లేదు కదా అన్నాడు. అంతే అది విన్న ఆ ఇంజనీరు ఇంత మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు, ఏమీ చదువుకోని ఈ వ్యక్తికి ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉండి పోయాడు. 


కాబట్టి మిత్రులారా! ఏ మనిషిని పైన చూసి తక్కువ అంచనా వేయకండి, అలాగే చిన్నచూపు చూడకండి. ఎవరి మైండ్ ఎంత పదునుగా ఉంటుందో బయటకు తెలియదు కదా! మీరు గమనిస్తే "ఇప్పుడున్న చదువులు విజ్ఞానాన్ని పెంచే విధంగా ఉన్నా, జ్ఞానాన్ని సూన్యం చేస్తున్నాయని " చెప్పవచ్చు. అన్ని తెలివితేటలు ఉన్నా మేధావులు తమ తెలివితేటలను ఏ సమయంలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియడం లేదు. 


మీరు గమనిస్తే "ప్రాణాలతో ఉన్న పక్షికి చీమలు ఆహరం, కానీ అదే పక్షి తాను చచ్చిన తర్వాత తాను తినే ఆ చీమలకే ఆహారం అవుతుంది ". పరిస్థితులు ఎలాగైనా మారొచ్చు కాబట్టి ఎవరిని తక్కువగా అంచనా వేసి చులకనగా చూడకండి, అలుసుగా మాట్లాడకండి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి