ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వూహానులొ పుట్టింది - ఊరంతా పాకింది


రచన:గడ్డం.శంకర్
ఎస్. తెలుగు
జి.ప.ఉ.పా ఆకునూర్
సైదాపూర్,కరీంనగర్

స్వగ్రామం;శ్రీరాములపల్లి
మం:కమలాపూర్
జిల్లా:వరంగల్ అర్బన్

*కరోనా-*

వూహానులొ పుట్టింది
ఊరంతా పాకింది
లక్షలాది ప్రాణాలను
కసిబూనీ తీసింది 01

ఆరడుగల దూరము
పాటిస్తే ఫలితము
నిర్లక్ష్యము చేసినచో
కోవిడుకు చిక్కుతము 02

మాస్కు మరిచిపోవద్దు
ముక్కుమూతి ముట్టొద్దు
నిరతము జనులంతా
కరముకడుగుటాపద్దు 03

గుంపులుగ తిరగవద్దు
ఫంక్షన్లకు పోవద్దు
ప్రభుత్వ నియమాలను
పెడచెవిన పెట్టవద్దు 04

పరిశుభ్రత పాటిస్తే
నియమాలనాచరిస్తే
అంటుకోదు కరోనా
నిరంతరం కాపుగాస్తె 05

మనవాళ్ళని కలవాళ్ళని
చూడద్దూ కలవాలని
అవకాశముకై వేచెను
కోవిడు నిను చేరాలని 06

బలవర్ధక ఆహారం
స్వస్థతకీ శ్రీకారం
మరవకుంట తింటనే
కలలన్నీ సాకారం 07

ఆధునికత పేరిట
ఆరోగ్యము కటకట
విశృంఖల చర్యలే
కోవిడుకు మూలమట 08

మందులేని రోగము
అంటుకుంటె ఆగము
ఎదుర్కొనుటకు రోగాన్ని
కావలెనోయ్ ధైర్యము 09

కులం లేదు మతంలేదు
చిన్న పెద్ద తేడలేదు
అందరిని సమానంగా
అంటుకొనుట ఆపలేదు 10

ఒకరినొకరు చూడకుండ
ఓదార్పును ఇవ్వకుండ
ఇంటినబంధించుచుండె
కోవిడిపుడు కదలకుండ11

విజ్ఞానం యెంతవున్న
విధిరాతను ఆపదన్న
చేసినట్టి తప్పులకు
శిక్షపడక తప్పదన్న 12

కనీవినీ యెరుగనిది
జీవితాన మరువనిది
పగబట్టి ప్రాణాలను
తీయకుంట వొదలనది 13

ఆర్థిక వ్యవస్థనలను
చేసేను పరేషాను
కోలుకోని దెబ్బతీసె
కోవీడు పాడుగాను 14

ఉద్యోగమూడిపోయె
బతుకేమొ భారమాయె
పరిశ్రమలు మూతబడి
ఉపాధిపుడు కరువాయె 15

పట్నాన్నీ విడిచినారు
పల్లెబాట పట్టినారు
కూలినాలి చేసుకుంటు
కుటుంబాన్ని సాదినారు 16

చదువులన్ని ఆగిపాయె
చురుకుదనం తగ్గిపాయె
సెల్లుఫోను పట్టుకొని
సొల్లంతా చెప్పుడాయె 17

కరములెపుడు కలపవద్దు
నమస్కారం మరవద్దు
ఏమైతదిలే అని
దాటవద్దూ నీ హద్దు 18

పల్లెదారి పట్టింది
దంష్ట్రికలను చాచింది
అంతట నేనంటూ
ఉగ్రరూపం దాల్చింది 19

ఊపిరాడనీయకుండ
జ్వరమన్నది తగ్గకుండ
ఉక్కిరిబిక్కిరి జేయు
అంటుకుంటె వదలకుండ 20

ఆయుర్వేద పద్దతులు
పాటించెను నేడుజనులు
గతమెంతో ఘనమని
తెలుసుకున్న మేధావులు 21

కొత్తవ్యాధి వచ్చింది
కొరివి దయ్యమయ్యింది
కోట్లాది జనులందరి
ఒంటిలోకి చేరింది 22

ప్రయాణాలు చేయవద్దు
ప్రమాదంలో పడవద్దు
కరోనా ప్రళయంలో
చిక్కి శల్యం కావద్దు 23

వ్యాయమం చెయ్యిలి
మద్యాన్నీ మానాలి
ధూమపానమొదిలేసి
శుభ్రంగా ఉండాలి 24

వేడినీరు తాగాలి
ఫలములెన్నో తినాలి
ఆకుకూర వంటలతో
ఆరోగ్యంగుండాలి 25


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి