ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రేమలో పడ్డారా ! ఈ లక్షణాలున్నాయేమో చూచుకోండి.

యవ్వనదశలో ప్రేమలో పడ్డాం, గాఢంగా ప్రేమించుకొంటున్నాం. 

ప్రేమే జీవితం

ప్రేమే శాశ్వితం

ఒకరిని విడిచి మరొకరు ఉండలేం.

మాకు కులంతో పనిలేదు, మతంతో పనిలేదు. కనిపెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పినఅమ్మనాన్నలు వద్దు,అభిమానించే అన్నదమ్ములు వద్దు,మంచిని చెప్పే సావాసగాళ్ళు వద్దు, మమ్మల్ని ఎవరు విడదీయలేరని భావిస్తున్నామని అంటారా !

మీ ఇష్టం.


ఇలావుంటే మీది ప్రేమకాదు, ఆకర్షణే.

ఈ ఆకర్షణ తప్పకుండా పెండ్లికి దారితీస్తే ఇందులో success rate ఎంత ?

ఎంతోతెలుసా కేవలం 18% మాత్రమే. 

ఆకర్షణ తగ్గిపోగానే వాస్తవవిషయాలు తెలియగానే, కుటుంబ పరిస్థితులు అవగతంకాగానే 

కట్టుకొన్నవారి మనస్తత్వం తెలియగానే కాళ్ళకింద భూమి కంపిస్తుంది.

ఏం చేయలేం. కట్టుకొన్నవారిని వదలలేరు. అలాగని రాజీపడలేరు. జరిగినదానికి వగచివగచి,అంగలారుస్తూ, మనశ్శాంతిలేక బతుకుబండి ఈడ్చాలి.

పిల్లోజల్లో పుడితే అదో జంజాటం.


ఇంక ఎక్కువగా వద్దుకాని మీ ప్రేమను మీ అమ్మనాన్నలు అంగీకరిస్తేనే పెండ్లి చేసుకోండి, లేకుంటే వద్దేవద్దు. కొందరు లవ్ పేరుతో వలపన్ని తమ మతంలోకి మార్చుకొంటున్నారు. ఇలాంటి ప్రేమవ్యవహారాలలో జాగ్రత్త అవసరం.


ప్రేమలో కాదుకాదు ఆకర్షణలో పడితే మీ పరిస్థితి ఎలా వుంటుందో పెద్దలు ఇలా సెలవిచ్చారు. వీటినే దశవిధ మన్మథావస్థలని అన్నారు.


(1) చూచుట... ఎప్పుడు వారిని చూడాలని అనుకోవడం.

(2) మనస్సంగమం... మనసులో ఊహించుకోవడం. పెండ్లి చేసుకొన్నట్టు, సంసారం సాగిస్తున్నట్టు.కొందరు మానసిక వ్యభిచారం కూడా చేస్తారు.

(3) తలంపు... తిన్నా, పడుకొన్నా, పనిలోవున్నా వారి తలపులే మనసులో వుంటాయి.

(4) జాగరం... ఎవేవే ఊహలతో నిద్రరాకపోవడం

(5) కృశించుట... తినకుండా, నిద్రపోకుండా, అలసటతో నశించడం

(6) అన్యవస్తు విముఖత... నాకు జీవితంలో ఏ భోగభాగ్యాలు వద్దు.కార్లు వద్దు, ఇండ్లువద్దు.నాకు ప్రేముంటే చాలు అనుకోవడం.

(7) సిగ్గులేమి... సిగ్గులజ్జ వదిలేసి ప్రేమపేరుతో సిస్సిగ్గుగా తిరగటం. ఎవరు ఎమనుకొంటే నాకేం ఎక్కడబడితే అక్కడ తిరుగుతారు కుడా.

(8) ఉన్మాదం... ప్రేమపేరుతో పిచ్చోడిలా తిరగడం, ఉన్మాదిగా మారి అందరిని ఎదిరించడం, తిట్టడం, కొట్టడం చేస్తారు.సైకోగా మారటం.

(9) మూర్ఛ... ప్రేమకు పరాకాష్ఠ తెలివిలేకుండా ప్రవర్తించడం.జ్ఞానం కోల్పోవడం.కొండకచో తెలివి తప్పిపడిపోవడం కూడా జరుగుతుంది.

(10) చావు... పెద్దలు ఒప్పుకోలేదని చచ్చిపోవడం.చావడం అవసరమా ? అమ్మనాన్నలు ఇచ్చిన నిండు నూరేళ్ళ జీవితాన్ని చాలించడం భావ్యమా ?


పై లక్షణాలలో కొన్ని కొందరికి రావచ్చు. లేదా అన్ని రావచ్చు.



CREDITS: జి.బి.విశ్వనాథ.. అనంతపురం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి