ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బ్రహ్మదేవా నీకు చాదస్తం పెరిగిపోతోంది .. శివుడికేం తెలియదు

నారదుడు త్రిలోకసంచారి.ఏ లోకానికైనా ఏ ప్రదేశానికైనా పాసుపోర్టు వీసాలులేకనే తిరిగేస్తుంటాడు. ఇతను ఏ దేశానికి వెళ్లినా, చివరకు శత్రుదేశాలకు వెళ్లినా అందరూ లేచి నిలబడి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారే తప్ప తిరస్కరించరు. 

తగులమారి, తంటాలమారి, జగడాలమారి అనే బిదురులు ఇచ్చేశారు. ఏవరు ఏమన్నా ఏమనుకున్నా సరే  చేయాల్సిన పనిని 4 G కంటే ముందుగా స్ఫీడుగా  కనెక్టై పని చేసేస్తాడు.ఇతని చర్యలు పనులు కొందరికి ఇబ్బందిగా వున్నా మరికొందరు చచ్చినా, అంతా లోకకళ్యాణానికేనంటాడు. నారాయణ నారాయణ అంటూ చిరతలు / చిడతలు వాయించుకొంటూ వెళుతుంటాడు. చివరికి దేవతలు రాక్షసులు కూడా నారదుడి దూరదృష్టి సరైనదేనని నమ్ముతారు.

ఇలాంటి తగువులమారి నారదుడు భూలోకంలో ఒకసారి పయనిస్తుంటే కాలికేదో తగిలి ఠంగుమని శబ్దం వచ్చింది.నారదుడైన నా కాళ్ళకే ఏమిటబ్బా తగిలిందని వంగి చూచాడు. అదో మానవపుర్రె. నారదుడికి ఆసక్తి కలిగింది.పుర్రె చేతిలోకి తీసుకొని దాని కపాలం చూచాడు.ఆ కపాలం మీద తండ్రి బ్రహ్మదేవుడు వ్రాసిన గీతలు కనబడ్డాయి.అసక్తిగా చదివాడు. ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందనే  రాతను చదివాడు.

నారదుడికి విస్మయం కలిగింది.పుర్రె ఏమిటి మూడు లోకాలను తిరగడమేమిటి ? దీని సంగతేమో తేల్చుకొందామని పుర్రెలను మెడలో వేసుకొని తిరిగే శివుడిని అడిగాలని

నేరుగా కైలాసానికి వెళ్ళి శివుడితో చూసారా ! ముక్కంటి  ఈ పుర్రె మూడు లోకాలను సందర్శిస్తుందని బ్రహ్మ వ్రాశాడు. ఇదేం చోద్యం, కారణమేమిటో చెప్పండంటూ విన్నవించాడు. అందుకా జటాధారి నారదా! ఈ పుర్రె ధూమకేత మహరాజుది. వీడి ఆగడాలు ఎక్కువైతే విష్ణువు వీడితల సుదర్శచక్రంతో ఖండించాడు.కపాలలాలను నేను మెడలో వేసుకొన్నంత మాత్రాన నాకు అన్ని తెలిసివుండాలనే రూలేమి లేదు.కాబట్టి నువ్ తిన్నగా వైకుంఠానికి వెళ్ళి ధూమకేతు మహారాజును సంహరించిన విష్ణుదేవుడినే అడుగు ఆయన నీకు సరైన జవాబు చెప్పగలడని సమాధానం ఇచ్చాడు. 

శివుడికేం తెలియదంటూ గొణుక్కుంటూ వైకుంఠం దారిబట్టాడు నారదుడు. వైకుంఠంలో దేవదేవుణికి నమస్కరించి నారాయణ నారాయణ అంటూ గానం చేశాడు. చూశావా పద్మనాభ ఈ పుర్రెకు కాళ్ళులేవు, ప్రాణంలేదు. కదలదు మెదలదు ఇది ముల్లోకాలను తిరుగుతుందట. మా నాన్నకు వయసుఎక్కువైతున్న కొద్ది చాదస్తం కూడా ఎక్కుమైంది.ఏదిబడితే అది వ్రాసేస్తున్నాడంటూ ఓ కంప్లైంట్  ఫైల్ చేశాడు.

అందుకా గోవిందుడు నారదా! బ్రహ్మరాతకు తిరుగులేదు. జరిగితీరుతుంది కూడా. అయినా నారదా! ఇదిగో ఇటు చూడు నాకు దుష్టుల సంహరమే తెలుసు అంతేకాని ఇలా పుర్రెలను చదవడం కారణాలు వెతకడం నాకు తెలియదయ్యా! అయినా నాకేం వేరేపనేమి లేదనుకొన్నావా ? వెళ్ళువయ్యా వెళ్ళు ఆ పిచ్చిగీతలేవో వ్రాసిన మీ తండ్రినే అడుగు, ఇదిగో నీ పుర్రెను నువ్వే తీసుకుపో అంటూ చేతిలో పెట్టాడు.

సరే సరే మా నాన్నతోనే తేల్చుకొంటాలే. నువ్ ఏదో పనోడివి అన్ని తెలుసునోడివనుకొని నీ దగ్గరకొచ్చానంటూ రుసరుసలాడుతూ సత్యలోకం వైపు కదిలాడు నారదుడు.

సత్యలోకంలో బ్రహ్మ నాలుగు తలలతో ఆలోచిస్తూ చతుర్భుజాలతో బాలపుర్రెల మీద ఎవో గీతలు వ్రాసుకొంటున్నాడు. నారదుడు నాన్న నాన్నోయ్ అంటూ పిలిచాడు. ఆయనేదో ఆయన దోరణిలోనే వున్నాడు. నారదుడుకి విసుగొచ్చింది, నాన్నోయ్యంటూ ముల్లోకాలు వినబడేలా గట్టిగా అరిచాడు. బ్రహ్మ తలపైకెత్తి ఏమిటన్నట్టు చూచాడు.

నారదుడు ధూమకేతమహరాజు యొక్క పుర్రెను బ్రహ్మ టెబుల్ పైకి విసిరికొట్టి ఏమిటి నాన్న నువ్ వ్రాసేది, నీలో చాదస్తం పెరిగిపోతోంది.ఏది సాధ్యం ఏది అసాధ్యమనే ఆలోచనలు లేకుండా ఘంటముంది కదాని ఏదంటే ఆది వ్రాసేస్తున్నావు. చూడు ఈ పుర్రె మీద ఏం వ్రాసావో, వ్రాసేముందు ఆలోచించాక్కర లేదా!  కాళ్ళు,కండ్లు ప్రాణం లేని కపాలమేమిటి ముల్లోకాలను చుట్టడమేమిటంటూ ధబాయించి అడిగాడు.

అందుకు బ్రహ్మదేవుడు నాయన విధిలిఖితాన్ని ఎవరూ తప్పించలేరు. చివరకు నేను వ్రాసిన వ్రాతలు తుడపటానికి నా వల్లకూడా కాదు. నేను వ్రాసిందేమి పొల్లుపోదు.

ఇక ఆ కపాలం సంగతంటావా నువ్వే ఆ గీతలు ఎందుకున్నాయో తెలుసుకోటానికి పుర్రెను చేత్తోపట్టుకొని మొదట కైలాసానికి, ఆ తరువాత వైకుంఠానికి చివరికి నా దగ్గరకు అంటే సత్యలోకానికి తీసుకువచ్చావ్.అంటే నేను వ్రాసిన రాతలను నిజం చేస్తూ ఈ పుర్రెను నువ్వే మూడు లోకాలను తిప్పినావంటూ సమాధానం ఇవ్వగానే 

నారదుడు సారీ నాన్నా అంటూ అమ్మ సరస్వతమ్మచాటుకు చేరి ముఖం కనబడకుండా అమ్మ చీరచెంగుతో తలను కప్పేసుకొన్నాడు సిగ్గుతో.


Credits: .జి.బి.విశ్వనాథ.. అనంతపురం. 

కామెంట్‌లు

  1. చాలా బాగుంది. అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది. బ్రహ్మ కి కూడా table ఉందా?

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ..

గ్రంథాలయ శాస్త్ర పితామహుడు శ్రీ ఎస్.ఆర్ రంగనాథన్ గారి జయంతి ఈరోజు ఆసందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.... జననం 12 ఆగష్టు 1892 మరణం 27 సెప్టెంబరు1972 గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి, గ్రంథాలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన గణిత శాస్త్రవేత్త షియాలి రామామృత రంగనాథన్ గారు ఆగస్టు 12వ తేదిన 1892 తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని షియాలీ అనే గ్రామంలో జన్మించారు. దాదాపు రోజుకు 10–15 గంటలకు పైగా పనిచేస్తూ, వారానికి ఒక్క రోజైనా సెలవు తీసుకోకుండా నిరంతరాయంగా రంగనాథన్ గ్రంథపాలక వృత్తే దైవంగా, పనే జీవితంగా గడిపిన నిర్మలకర్మయోగి. ఆధునిక వైజ్ఞానిక సాంకేతిక రంగాలలో పెను మార్పులు చోటుచేసుకున్న ఈసమయంలో కూడా గ్రంథాలయాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంటుందని ఆనాడే గుర్తించి, గ్రంథాలయాలకు ఒక శాస్త్రాన్ని ప్రవేశపెట్టి, ప్రజలకు విజ్ఞానాన్ని పంచే ప్రజా విశ్వవిద్యాలయాల అని పిలువబడే పౌర గ్రంథాలయాలుకు రూపకల్పన చేశారు. నేడు ఈ ప్రజా విశ్వవిద్యాలయాలకు ప్రజల నుండి ఆదరణ ఉందంటే అది రంగనాథన్ చేసిన కృషి వల్లనే అన్నది నగ్న సత్యం. 1924 సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం గ్రంథపాలకునిగా ఆయన నియమితులయ్యారు.. కొద్ది కాలం పాటు ఇంగ్లాండ్ పర్

ఆత్మవిశ్వాసం ఎలా వస్తుందంటే

  ఆత్మవిశ్వాసం అంటే నాలో నాకు నమ్మకం కలిగించిన సన్నివేశాలు మూడో నాలుగో ఉన్నాయి నాకు జ్ఞాపకం ఉన్నవి. చెప్పేను కదా మాఇంట్లో ఎదురుపడి మాట్లాడుకోడం తక్కువే అని. నువ్వు ఆడపిల్లవి ఇలా ఉండాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యకూడదు అంటూ ఎప్పుడూ ఏ ఆంక్షలూ లేవు. నీతిపాఠాలు అసలే లేవు. హైస్కూలు రోజుల్లో పరీక్షఫీజు కట్టడానికి నాన్నగారు విద్యార్థులని స్కూలు ఆపీసుకి తీసుకెళ్లేరు. ఆ తరవాత నాకు డబ్బు ఇచ్చి, “వెళ్లి ఫీజు కట్టి రా,” అన్నారు. నాకు కోపం వచ్చింది. “వాళ్ళతో వెళ్లేరు కదా, నాతో ఎందుకు రారూ?” అని అడిగేను. “వాళ్ళకి చేతకాదు. నువ్వు చేసుకోగలవు,” అన్నారాయన. ఇది నాకు మొదటిపాఠం నాగురించి నాకు నేను ఆలోచించుకునే విషయంలో. అలాగే మాఅమ్మ కూడా. ఒకసారి ఎవరో, “అమ్మాయిని శ్రద్ధగా చదువుకోమని చెప్పండి,” అంటే, అమ్మ, “నేను చెప్పఖ్ఖర్లేదు. దానికి తెలీదేమిటి,” అనడం విన్నాను. నా యూనివర్సిటీ చదువు అయిపోయేక, నేను విజయనగరం విమెన్స్ కాలేజీలో లైబ్రేరియన్ గా ఒక సంవత్సరం పని చేసేను. అక్కడ ఇద్దరు లెక్చరర్లు, రేణుక, సీతారామమ్మ, నేనూ మంచి స్నేహితులం అయిపోయేం. ముగ్గురం కలిసి మెలిసి తిరుగుతూండేవాళ్ళం. ఒకసారి రేణుకకి భువనేశ్వరంలో ఇంటర్వ్యూ

ఏం చేస్తున్నావమ్మా అక్కడ?

 " ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మట్టిలో ఆడుతున్నావా? " అడిగేను మా పదేళ్ళ పాపను. " లేదమ్మా. కాలి మీద చీమ కుడుతుంది తీసి పారేస్తున్నాను" " అయ్యయ్యో. చీమ కుడుతుంటే అంత సున్నితంగా తీస్తే వస్తుందా తల్లీ ? నలిపి పారేయాలి గాని ఏదీ ఇలా రా " అన్నాను " వచ్చేసిందిలే అమ్మా. నలిపి పారేస్తే పాపం చీమ చచ్చిపోదూ? జీవహింస చేయడం మహా పాపమట కదా? " కళ్ళు చక్రాల్లా త్రిప్పుతూ అంది. "ఎవరు చేప్పేరమ్మా నీకు? " కుతూహలంగా ప్రశ్నించేను. "ఈవేళ మా టీచర్ అహింసా పరమో ధర్మః అనే పాఠం చెప్పేరు. దేన్నీ హింసించకుండా ఉండడమే అన్ని ధర్మాలలోకీ గొప్పదట. అదే మానవ ధర్మం కూడానట. చూడమ్మా. కుట్టడం చీమ లక్షణం. అది చచ్చిపోయేటప్పుడు కూడా తన లక్షణాన్ని విడిచిపెట్టడంలేదు.అలాంటప్పుడు మనం మన ధర్మాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? దాన్ని హింసించక పోవడమే మన ధర్మం" అంది ఓ ఉపదేశకురాలిలా. " చిన్నదానివైనా ఎంత చక్కగా చెప్పెవమ్మా. అలవాటు ప్రకారం స్కూల్ లో చెప్పిన పాఠం నీ మనసులో ఎంతగా హత్తుకుపోయిందో. పెద్దవాళ్ళ మైనా మేము అంతగా పట్టించుకోలేదు. ఏడీ? మీ అన్నయ్య ఏడీ? ఆ రౌడీ వెధవను ఇలా రమ్మను. వాడి