చదువుకొన్న " వాడు మాత్రమే మేధావా? 'చదువుకొనని ' వాడు మేధావి కాదా? దీనికి మీకు ఒక మంచి ఉదాహరణను అందిస్తాను, చదవండి. ఒక వ్యక్తి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, కృషి, పట్టుదలతో కష్టపడి బాగా డబ్బు సంపాదించి, జీవితంలో బాగా సెటిల్ అయ్యాడు. అతను ఒకసారి అర్జెంటు పని బడి సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల తానే స్వయంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక ఉన్నట్టుండి ఒక టైర్ పంచర్ అయ్యింది. టైర్ మార్చడానికి డ్రైవర్ లేడు. అటు పక్కగా ఎక్కడా ఎవరి రాకపోకలు లేవు. ఇక తప్పని పరిస్థితిలో తానే ఎలాగోలా స్టెప్ని టైర్ మార్చడానికి తనే స్వయంగా సిద్ధమయ్యాడు. డిక్కీ లోని టూల్స్, స్టెప్నీ టైర్ బయటకు తీసి, ఎంతో కష్టపడి వీల్ నట్లన్నీ తీసి టైర్ మారుస్తుండగా చెయ్యి జారీ టయర్ నట్ల పైపడి అవన్నీ పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాయి. సూటు బూటు లో ఉన్న తాను వాటిని తీయలేడు, మరి ఇప్పుడేం చేయాలా అని ఆలోచిస్తుండగా అటు పక్కగా ఒక వ్యక్తి అక్కడక్కడా చినిగి పోయిన, మురికి బట్టలు వేసుకున్న వ్యక్తి అటుగా వచ్చాడు. అతడు ఈయన్ని చూసి సార్ మీరు ఎవరు, మీ కారుకు ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆ ఇంజనీర్ తాను ఎవరో తన
సుభాష్ చంద్రబోస్ ...ఈ పేరు తెలియని భారతీయుడుండడేమో...ఆ పేరు వినబడగానే ఏదో మనసులో ఒక ఆరాధభావన.. ఆయన మతాలకతీతుడు, కులవర్గాలకు అతీతుడు..ఈ దేశంలో జన్మించి విదేశీయుల బానిసత్వం నుండి ఈ దేశానికి విముక్తి కలిగించాలని పోరాటం చేస్తూ కనుమరుగైపోయిన ఒక గొప్ప స్వాతంత్రసమరయోధుడు ఈ నేతాజీ!!! జనవరి 23,1897లో కటక్ లో ఒక సంపన్నకుటుంబంలో జన్మించిన బోస్ అక్కడే విద్యాభ్యాసం చేశారు.తండ్రి జానకీనాథ్ గొప్పలాయర్ ..మరియ అతివాద భావాలు గల కాంగ్రీస్ నాయకుడు. 1920 లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షలో నాల్గవర్యాంక్ రాగా ఇంగ్లీషులో ఆల్ ఇంగ్లండ్ స్తాయిలో ప్రథముడుగా నిలిచాడు. అయితే 1921 ఏప్రెల్ లో సివిల్ సర్వీస్ కి రిజైన్ చేసి భారతస్వాతంత్రోద్యమంలోనికి ప్రవేశించారు..భారత జాతీయకాంగ్రీసు లో యువజన అధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషించారు.చిత్తరంజన్ దాస్ గారితో కలిసి బెంగాల్ ఉద్యమం నడిపేరు. హిందీలో అతని ప్రసంగాలు ప్రజలను ఉర్రూతలూగించేవి.అనతికాలంలో మంచివక్తగా, ఆకర్షణీయమైన నాయకుడిగా ఎదిగేరు. 1937 డిశంబరు 26 న ఎమిలీషెంకల్ అనే ఆమెను వివాహం చేసుకున్నారు.. అయితే స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్న తీరుపట్ల బోస్ అసంతృప్తిగా వుండేవారు.గాంధ